
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
● మరొకరికి తీవ్ర గాయాలు
మనుబోలు: ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడిన ఘటన మండల పరిధిలోని జాతీయ రహదారిపై కాగితాలపూరు క్రాస్రోడ్డు సమీపంలో ఆదివారం చోటుచేసుకుంది. వివరాలు.. సైదాపురం మండలానికి చెందిన అచ్చి వెంకటరాజ, చల్లా మన్వేష్ కలిసి స్నేహితుడి కారు తీసుకొని నెల్లూరు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో కాగితాలపూరు క్రాస్రోడ్డు సమీపంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఎదురుగా హైవేపై ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ప్రమాదంలో కారు ముందుభాగం నుజ్జునుజ్జుకాగా, వెంకటరాజ అక్కడికక్కడే మృతి చెందారు. మన్వేష్ తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఇరుక్కుపోయిన వీరిని స్వర్ణ టోల్వే సిబ్బంది వచ్చి బయటకు తీశారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రుడ్ని గూడూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం