
సొంతగడ్డపై టీమిండియా టెస్టు సిరీస్ విజయాలకు న్యూజిలాండ్ బ్రేక్లు వేసింది. పుణే వేదికగా కివీస్తో జరిగిన రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో భారత జట్టు ఓటమి పాలైంది. దీంతో మూడు మ్యాచ్ల టెస్టు సిరీస్ను 2-0 తేడాతో రోహిత్ సేన కోల్పోయింది.
కాగా స్వదేశంలో టెస్టు సిరీస్ను భారత్ కోల్పోవడం 12 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే రెండో టెస్టులో బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే భారత్ పరాజయం పాలైంది. 359 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 245 పరుగులకు ఆలౌటైంది. అంతకుముందు తొలి ఇన్నింగ్స్లో 156 పరుగులకే టీమిండియా కుప్పకూలింది.
న్యూజిలాండ్ స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ 13 వికెట్లతో తమ జట్టుకు భారత గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయాన్ని అందించాడు. కాగా ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ విరాట్ కోహ్లి తన సహనాన్ని కోల్పోయాడు. ఆన్ ఫీల్డ్ అంపైర్ రిచర్డ్ ఇల్లింగ్ వర్త్పై కోహ్లి సీరియస్ అయ్యాడు. తన ఔట్ విషయంలో అంపైర్ నిర్ణయాన్ని విరాట్ వ్యతిరేకించాడు.
అసలేం జరిగిందంటే?
భారత ఇన్నింగ్స్ 29వ ఓవర్ వేసిన సాంట్నర్ బౌలింగ్లో చివరి బంతిని కోహ్లి ఫ్లిక్ షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. కానీ బంతి అతడి బ్యాట్కు మిస్స్ అయ్యి ప్యాడ్కు తాకింది. దీంతో కివీస్ ఆటగాళ్లు ఎల్బీకి అప్పీల్ చేయగా, ఫీల్డ్ అంపైర్ ఇల్లింగ్ వర్త్ ఔట్ అని చేతి వేలు పైకెత్తాడు.
అయితే బంతి స్టంప్స్ను మిస్ అవుతుందని భావించిన కోహ్లి.. వెంటనే రివ్యూ కోరాడు. కానీ రీప్లేలో బంతి లెగ్ స్టంప్ను కొంచెం తాకుతున్నట్లుగా కనిపించి అంపైర్స్ కాల్గా తేలింది. ఈ క్రమంలోనే అంపైర్పై కోహ్లి అగ్రహం వ్యక్తం చేశాడు. అతడి వైపు సీరియస్గా చూస్తూ కోహ్లి మైదానాన్ని వీడాడు.
అంతేకాకుండా డ్రెస్సింగ్ రూమ్కు వెళ్లే క్రమంలో ఐస్ బ్యాక్స్కు తన బ్యాట్తో కోపంతో బాదాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. కాగా ఈ మ్యాచ్లో కోహ్లి రెండు ఇన్నింగ్స్లు కలిపి కేవలం 18 పరుగులు మాత్రమే చేశాడు.
Dear bro Virat Kohli, The bat is hit over the ball, not over this water box.🤬 #INDvNZ pic.twitter.com/FZshuZIkzL
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) October 26, 2024
చదవండి: అస్సలు ఊహించలేదు.. ఇది సమిష్టి వైఫల్యం: రోహిత్ శర్మ