IPL 2022: శిఖ‌ర్ ధావ‌న్ అరుదైన రికార్డు.. తొలి ఆట‌గాడిగా!

S Dhawan Become Most runs against an opponent in IPL - Sakshi

IPL 2022 PBKS Vs CSK: టీమిండియా స్టార్ ఓపెన‌ర్, పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు శిఖ‌ర్ ధావ‌న్  ఐపీఎల్‌లో అరుదైన ఘనత సాధించాడు.  ఒకే ఫ్రాంఛైజీ(ప్రత్యర్థి జట్టు)పై అత్య‌ధిక ప‌రుగులు సాధించిన ఆట‌గాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా ఏప్రిల్‌25న‌ చెన్నై సూప‌ర్ కింగ్స్‌తో మ్యాచ్‌లో ఈ ఫీట్‌ నమోదు చేశాడు.

ఇక సీఎస్‌కేపై ధావ‌న్ ఇప్ప‌టి వ‌ర‌కు 1022 ప‌ర‌గులు సాధించి తొలి స్థానంలో ఉండ‌గా.. రోహిత్ శ‌ర్మ కేకేఆర్‌పై 1018 ప‌రుగులతో రెండో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఇక ఇదే మ్యాచ్‌లో ధావ‌న్ టీ20 క్రికెట్‌లో 9000 ప‌రుగుల మైలు రాయిని అందుకున్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో పంజాబ్‌ 11 పరుగుల తేడాతో చెన్నైపై విజయం సాధించింది.

చ‌ద‌వండిIPL 2022: 'ఆ రెండు జ‌ట్లు కచ్చితంగా ప్లేఆఫ్స్‌కు చేరుకుంటాయి'

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top