మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు | Mohammed Siraj bags ICC Player of the Month | Sakshi
Sakshi News home page

ICC: మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు

Sep 15 2025 2:24 PM | Updated on Sep 15 2025 3:18 PM

Mohammed Siraj bags ICC Player of the Month

టీమిండియా పేస‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు ఐసీసీ ప్ర‌తిష్టాత్మ‌క అవార్డు ల‌భించింది. ఆగ‌స్టు నెల‌కు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ గా సిరాజ్ ఎంపికయ్యాడు. గ‌త నెల‌లో ఇంగ్లండ్‌తో జ‌రిగిన టెస్టు సిరీస్‌లో అద్బుత ప్ర‌ద‌ర్శ‌న‌కు గాను సిరాజ్‌కు ఈ అవార్డు ద‌క్కింది.

ముఖ్యంగా ఓవల్‌ వేదికగా జరిగిన ఆఖరి టెస్టులో సిరాజ్‌ అసాధారణ ప్రదర్శన కనబరిచాడు. ఓటమి తప్పదనుకున్న చోట సిరాజ్‌ తన సూపర్‌ స్పెల్‌తో భారత్‌కు చారిత్రత్మక విజయాన్ని అందించాడు. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో టీమిండియా సమం చేసింది.

ఆండర్సన్‌-టెండూల్కర్ ట్రోఫీలో  సిరాజ్(23) లీడింగ్ వికెట్ టేక‌ర్‌గా నిలిచాడు. అంతేకాకుండా సిరాజ్ సిరీస్ మొత్తంగా 1000 పైగా బంతులను బౌలింగ్ చేసి త‌న ఫిట్‌నెస్ ఎంటో చాటిచెప్పాడు.

ఇక ఈ ఐసీసీ ప్రతిష్టాత్మక అవార్డు కోసం న్యూజిలాండ్‌కు చెందిన మాట్ హెన్రీ, వెస్టిండీస్ ఫాస్ట్ బౌలర్ జేడెన్ సీల్స్ పోటీ పడ్డారు. కానీ వీరిద్దరికంటే సిరాజ్ మెరుగైన ప్రదర్శన చేయడంతో ఈ ఐసీసీ అవార్డు లభించింది. 

సిరాజ్ ఈ అవార్డును తన సహచరులకు, సహాయక సిబ్బందికి అంకితం చేశాడు. దేశం కోసం మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తాను సిరాజ్ పేర్కొన్నాడు. సిరాజ్ తిరిగి విండీస్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌లో భారత్ తరపున ఆడనున్నాడు. అక్టోబర్‌ 2 నుంచి భారత్‌-వెస్టిండీస్‌ మధ్య టెస్టు సిరీస్‌ ఆరంభం కానుంది.
చదవండి: చ‌రిత్ర సృష్టించిన టీమిండియా ఓపెనర్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయ‌ర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement