IND vs ENG: సుందర్‌-జడేజా జోడీ సరికొత్త చరిత్ర.. | Jadeja, Sundar Surpass Tendulkar, Azhar To Partnership In 4th Test | Sakshi
Sakshi News home page

IND vs ENG: సుందర్‌-జడేజా జోడీ సరికొత్త చరిత్ర..

Jul 28 2025 2:07 PM | Updated on Jul 28 2025 3:02 PM

Jadeja, Sundar Surpass Tendulkar, Azhar To Partnership In 4th Test

మాంచెస్టర్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో టెస్టు.. భారత క్రికెట్‌ చరిత్రలో చిరస్మరణీయంగా మిగిలిపోనుంది. ఓటమి తప్పదనుకున్న చోట భారత బ్యాటర్లు అద్బుతం చేశారు. తమ విరోచిత పోరాటంతో మ్యాచ్‌ను డ్రా ముగించి సిరీస్‌ ఆశలను సజీవంగా ఉంచుకున్నారు.

ఈ మ్యాచ్‌ను భారత్‌ డ్రా ముగించడంలో రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లది కీలక పాత్ర. ఆఖరి రోజు ఆటలో కేఎల్‌ రాహుల్‌, శుబ్‌మన్‌ గిల్‌ ఔటైన తర్వాత ఈ ఇద్దరు ఆల్‌రౌండర్లు జట్టు బాధ్యతను తమ భుజాలపై వేసుకున్నారు.

ఇంగ్లండ్‌ బౌలర్ల సహనాన్ని పరీక్షిస్తూ తమ సెంచరీల మార్క్‌ను అందుకున్నారు. ఇద్దరూ కలసి ఐదో వికెట్‌కు 203 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించారు. ఈ క్రమంలో ఈ ఎడమ చేతి వాటం జోడీ ఓ అరుదైన ఘనతను తమ పేరిట లిఖించుకున్నారు.

ఓల్డ్‌ట్రాఫర్డ్‌ మైదానంలో టెస్టుల్లో ఐదో వికెట్‌కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన భారత జోడీగా సుందర్‌- జడేజా నిలిచారు. ఇంతకుముందు ఈ రికార్డు భారత క్రికెట్‌ దిగ్గజాలు సచిన్‌ టెండూల్కర్‌, మహ్మద్‌ అజారుద్దీన్‌ పేరిట ఉండేది. 

ఈ ఇద్దరు లెజెండరీ క్రికెటర్లు 1990లో మాంచెస్టర్‌ వేదికగా జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఐదో వికెట్‌కు 112 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. తాజా మ్యాచ్‌తో ఈ ఆల్‌టైమ్‌ రికార్డు బ్రేక్‌ అయ్యింది. ఇక భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య ఐదో టెస్టు జూలై 31 నుంచి లండన్‌లోని ఓవెల్‌ వేదికగా జరగనుంది.
చదవండి: మీ వాళ్లైతే ఇలాగే చేస్తావా?.. స్టోక్స్‌పై మండిపడ్డ గంభీర్‌
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement