ఆసీస్‌తో తొలి వన్డే.. టీమిండియా ఓటమి | India vs Australia 1st ODI Live Updates and Highlights | Sakshi
Sakshi News home page

ఆసీస్‌తో తొలి వన్డే.. టీమిండియా ఓటమి

Oct 19 2025 8:30 AM | Updated on Oct 19 2025 4:47 PM

India vs Australia 1st ODI Live Updates and Highlights

మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా 7 వికెట్ల తేడాతో పరాజయంపాలైంది. వరుణుడి అంతరాయాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది.

వికెట్‌కీపర్‌ కేఎల్‌ (38), అక్షర్‌ పటేల్‌ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్‌లో అరంగేట్రం​ ఆటగాడు నితీశ్‌ కుమార్‌ రెడ్డి (19 నాటౌట్‌) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు.

నాలుగు నెలల విరామం తర్వాత (ఛాంపియన్స్‌ ట్రోఫీ) రీఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ శర్మ (8), విరాట్‌ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. ఫుల్‌టైమ్‌ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌ (10) నిరాశపరిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు.

అనంతరం డక్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం ఆసీస్‌ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. ఆసీస్‌ 21.1 ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మిచెల్‌ మార్ష్‌ (46 నాటౌట్‌), రెన్‌షా (21 నాటౌట్‌) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. 

రెండో వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
7.5వ ఓవర్‌- 44 పరుగుల వద్ద ఆసీస్ రెండో వికెట్‌ కోల్పోయింది. అక్షర్‌ పటేల్‌ బౌలింగ్‌లో రోహిత్‌ శర్మ క్యాచ్‌ పట్టడంతో మాథ్యూ షార్ట్‌ (8) ఔటయ్యాడు.

తొలి వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌
26 ఓవర్లకు కుదించిన మ్యాచ్‌లో భారత్‌ తొలుత బ్యాటింగ్‌ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. అయితే డక​్‌వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం ఆసీస్‌ లక్ష్యాన్ని అన్నే ఓవర్లలో 131 పరుగులకు కుదించారు. 

ఛేదనను ఆసీస్‌ ఘనంగా ప్రారంభించింది. సిరాజ్‌ వేసిన తొలి ఓవర్‌లో హెడ్‌ రెండు బౌండరీలు బాదాడు. అయితే రెండో ఓవర్‌లో ఆసీస్‌కు షాక్‌ తగిలింది. అర్షదీప్‌ సింగ్‌ బౌలింగ్‌లో హర్షిత్‌ రాణాకు క్యాచ్‌ ఇచ్చి హెడ్‌ (8) ఔటయ్యాడు. 

స్వల్ప స్కోర్‌కే పరిమితమైన భారత్‌
పెర్త్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో భారత్‌ స్వల్ప స్కోర్‌కే పరిమితమైంది. వరుణుడి ఆటంకాల నడుమ 26 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసి 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు మాత్రమే చేయగలిగింది. 

వికెట్‌కీపర్‌ కేఎల్‌ (38), అక్షర్‌ పటేల్‌ (31) ఓ మోస్తరు స్కోర్లు చేయడంతో ఈ మాత్రం స్కోరైనా చేయగలిగింది. ఆఖరి ఓవర్‌లో నితీశ్‌ కుమార్‌ రెడ్డి (19 నాటౌట్‌) రెండు సిక్సర్లు బాది గౌరవప్రదమైన స్కోర్‌ అందించాడు. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రోహిత్‌ శర్మ (8), విరాట్‌ కోహ్లి (0) దారుణంగా విఫలమయ్యారు. 

ఫుల్‌టైమ్‌ వన్డే కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే శుభ్‌మన్‌ గిల్‌ (10) నిరాశపరిచాడు. శ్రేయస్‌ అయ్యర్‌ (11) పరుగులు చేసేందుకు చాలా ఇబ్బంది పడ్డాడు. వాషింగ్టన్‌ సుందర్‌ 10, హర్షిత్‌ రాణా 1, అర్షదీప్‌ సింగ్‌ డకౌటయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో జోష్‌ హాజిల్‌వుడ్‌, మిచెల్‌ ఓవెన్‌, కుహ్నేమన్‌ తలో 2 వికెట్లు తీయగా.. స్టార్క్‌, ఎల్లిస్‌ చెరో వికెట్‌ పడగొట్టారు.

ఐదో వికెట్‌ కోల్పోయిన టీమిండియా
19.6వ ఓవర్‌- 84 పరుగుల వద్ద టీమిండియా ఐదో వికెట్‌ కోల్పోయింది. కుహ్నేమన్‌ బౌలింగ్‌లో రెన్‌షాకు క్యాచ్‌ ఇచ్చి అక్షర్‌ పటేల్‌ (310 ఔటయ్యాడు. రాహుల్‌కు (17) జతగా వాషింగ్టన్‌ సుందర్‌ క్రీజ్‌లోకి వచ్చాడు. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌ 26 ఓవర్లకు కుదించిన విషయం తెలిసిందే. 

భారత్ నాలుగో వికెట్ డౌన్‌..
శ్రేయస్ అయ్యర్ రూపంలో భారత్ నాలుగో వికెట్ కోల్పోయింది. 11 పరుగులు చేసిన అయ్యర్‌.. జోష్ హాజిల్‌వుడ్ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 14 ఓవర్లు ముగిసే సరికి భారత్ 4 వికెట్ల నష్టానికి 45 పరుగులు చేసింది. క్రీజులో అక్షర్ పటేల్‌(10), కేఎల్ రాహుల్‌(0) ఉన్నారు.
 మ‌రి కాసేపట్లో ఆట మొద‌లు
మ‌రో 10 నిమిషాల్లో ఆట తిరిగి ప్రారంభం కానుంది. అయితే మ్యాచ్‌ను వ‌ర్షం కార‌ణంగా 35 ఓవ‌ర్ల‌కు కుదించారు. ప్ర‌స్తుతం భార‌త్ మూడు వికెట్ల న‌ష్టానికి 37 ప‌రుగులు చేసింది.

మరోసారి వర్షం​ అడ్డంకి..
పెర్త్ వ‌న్డేకు వ‌రుణుడు మ‌రోసారి అంత‌రాయం క‌లిగించాడు. భారత్‌ స్కోర్‌ 37/3 వద్ద ఉండగా.. వర్షం రావడంతో  ఆటను నిలిపివేశారు.

11 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 35/3
11 ఓవ‌ర్లు ముగిసే స‌రికి భార‌త్ మూడు వికెట్లు కోల్పోయి 35 ప‌రుగులు చేసింది. క్రీజులో అక్ష‌ర్ ప‌టేల్‌(6), శ్రేయ‌స్ అయ్య‌ర్‌(6) ఉన్నారు.

వర్షం అటంకి..
తొలి వన్డేకు వరుణుడు అంతరాయం కలిగించాడు. వర్షం కారణంగా ఆట నిలిచే పోయే సమయానికి భారత్‌ స్కోర్‌: 25/3.

కెప్టెన్‌ గిల్‌ ఔట్‌.. 
భారత్‌కు వరుస షాక్‌లు తగిలాయి. కెప్టెన్‌ గిల్‌ ఔట్‌. ఇన్నింగ్స్‌లో 10 పరుగులు చేసిన గిల్‌.. ఇల్లీస్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. 

కింగ్‌ కోహ్లీ ఔట్‌..
భారత్‌ మరో షాక్‌ తగిలింది. రోహిత్‌ బాటలోనే కింగ్‌ కోహ్లీ కూడా వెనుదిరిగాడు. స్టార్క్‌ బౌలింగ్‌లో కోహ్లీ.. క్యాచ్‌ అవుటయ్యాడు. ఈ ఇన్నింగ్స్‌లో కోహ్లీ డకౌట్‌ అయ్యాడు. 

రోహిత్‌ శర్మ ఔట్‌..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. ఓపెనర్ రోహిత్ శర్మ కేవలం 8 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. క్రీజులోకి విరాట్ కోహ్లి వచ్చాడు. 4 ఓవర్లకు భారత్‌ స్కోర్‌: 14/1

ఆచితూచి ఆడుతున్న ఓపెనర్లు..
3 ఓవర్లు ముగిసే సరికి భారత్‌ వికెట్‌ నష్టపోకుండా13 పరుగులు చేసింది. క్రీజులో శుభ్‌మన్‌ గిల్‌(5), రోహిత్‌ శర్మ(8) ఉన్నారు.

బౌలింగ్‌ ఎంచుకున్న ఆసీస్‌..
పెర్త్ వేదికగా తొలి వన్డేలో ఆస్ట్రేలియా-భారత్ తలపడతున్నాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్‌ కెప్టెన్‌ మిచెల్‌ మార్ష్‌ తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్‌లో భార‌త్ త‌ర‌పున నితీశ్ కుమార్ రెడ్డి వ‌న్డే అరంగేట్రం చేశాడు. అదేవిధంగా ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ముగ్గురు ఆల్‌రౌండర్లతో టీమిండియాకు బరిలోకి దిగింది.

మహ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్‌లు ఫాస్ట్ బౌలర్లగా చోటు దక్కించుకున్నారు. స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్లగా అక్షర్ పటేల్‌, వాషింగ్టన్ సుందర్ ఉన్నారు. అయితే స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు చోటు దక్కలేదు.

రోహిత్‌, విరాట్‌ కోహ్లి తిరిగి జట్టులోకి వచ్చారు. మరోవైపు ఆసీస్ తరపున ఇద్దరు ఆటగాళ్లు డెబ్యూ చేశారు. మాట్ రెన్‌షా, మిచెల్ ఓవెన్‌లకు వన్డే క్యాప్‌లను అందించారు.

తుది జట్లు
భారత్‌:  రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్‌), అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, మహమ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్

ఆస్ట్రేలియా: ట్రావిస్ హెడ్, మిచెల్ మార్ష్ (కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఫిలిప్ (వికెట్ కీపర్‌), మాట్ రెన్షా, కూపర్ కొన్నోలీ, మిచెల్ ఓవెన్, మిచెల్ స్టార్క్, నాథన్ ఎల్లిస్, మాథ్యూ కుహ్నెమాన్, జోష్ హాజిల్‌వుడ్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement