IND VS NZ 2nd ODI: టీమిండియా బౌలర్ల విజృంభణ.. 108 పరుగులకే కుప్పకూలిన న్యూజిలాండ్‌

IND VS NZ 2nd ODI: NZ All Out For 108 - Sakshi

రాయ్‌పూర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా బౌలర్లు రెచ్చిపోయారు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ చేసిన భారత్‌.. మహ్మద్‌ షమీ (3/18), మహ్మద్‌ సిరాజ్‌ (1/10), శార్దూల్‌ ఠాకూర్‌ (1/26), హార్ధిక్‌ పాండ్యా (2/16), కుల్దీప్‌ యాదవ్‌ (1/29), వాషింగ్టన్‌ సుందర్‌ (2/7) విజృంభించడంతో 34.3 ఓవర్లలోనే కివీస్‌ను ఆలౌట్‌ చేసింది.

న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్స్‌ (36), మైఖేల్‌ బ్రేస్‌వెల్‌ (22), మిచెల్‌ సాంట్నర్‌ (27) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు. తొలి వన్డే సెంచరీ హీరో బ్రేస్‌వెల్‌ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగేలా కనిపించినప్పటికీ.. అతన్ని షమీ బోల్తా కొట్టించాడు.

కివీస్‌ ఇన్నింగ్స్‌లో ఫిన్‌ అలెన్‌ (0), డెవాన్‌ కాన్వే (7), హెన్రీ నికోల్స్‌ (2), డారిల్‌ మిచెల్‌ (1), టామ్‌ లాథమ్‌ (1), ఫెర్గూసన్‌ (1), బ్లెయిర్‌ టిక్నర్‌ (2) విఫలమయ్యారు. కాగా, హైదరాబాద్‌ వేదికగా జరిగిన తొలి వన్డేలో భారత్‌ 12 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్‌ 1-0 ఆధిక్యంలో కొనసాగుతుంది. 

 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top