గిల్‌, జైశ్వాల్‌, పంత్ సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్‌ | IND vs ENG 1st Test: India all-out on 471 in the first innings | Sakshi
Sakshi News home page

IND vs ENG: గిల్‌, జైశ్వాల్‌, పంత్ సెంచరీలు.. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ భారీ స్కోర్‌

Jun 21 2025 6:38 PM | Updated on Jun 21 2025 7:12 PM

IND vs ENG 1st Test: India all-out on 471 in the first innings

లీడ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో భారత బ్యాటర్లు జూలు విదిల్చారు.  మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియా 471 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 359/3 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన గిల్‌ సేన. అదనంగా 112 పరుగులు జోడించి తమ ఇన్నింగ్స్‌ను ముగించింది.

రెండో రోజు ఆటలో టీమిండియా బ్యాటర్లు మెరుగ్గా రాణించలేకపోయారు. భారత బ్యాటర్లలో కెప్టెన్‌ శుబ్‌మ‌న్ గిల్ (147, 227 బంతుల్లో 19 ఫోర్లు, 1 సిక్స్‌), రిష‌బ్ పంత్ (134, 178 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్స‌ర్లు), య‌శ‌స్వి జైస్వాల్ (101 159 బంతుల్లో 16 ఫోర్లు, 1 సిక్స్‌) సెంచ‌రీల‌తో చెల‌రేగారు.

సుద‌ర్శ‌న్‌, క‌రుణ్ నాయ‌ర్ అట్ట‌ర్ ప్లాప్‌.. 
ఇక ఈ మ్యాచ్‌లో భార‌త త‌ర‌పున అరంగేట్రం చేసిన సాయిసుద‌ర్శ‌న్ తీవ్ర నిరాశ‌ప‌రిచాడు. మొద‌టి ఇన్నింగ్స్‌లో డ‌కౌట్‌గా వెనుదిరిగాడు. అత‌డితో పాటు తొమ్మిదేళ్ల త‌ర్వాత భార‌త టెస్టు జ‌ట్టులోకి వ‌చ్చిన క‌రుణ్ నాయ‌ర్ సైతం ఖాతా తెర‌వ‌కుండా పెవిలియ‌న్‌కు చేరాడు. ఇంగ్లండ్ బౌల‌ర్ల‌లో  కెప్టెన్ బెన్‌స్టోక్స్, జోష్ టంగ్ చెరో నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టారు. బ్రైడాన్ కార్స్, షోయ‌క్ బ‌షీర్ చెరో వికెట్ సాధించారు.
చదవండి: నాకు అది అలవాటు..! నువ్వే గుర్తు చేస్తూ ఉండాలి!.. నో చెప్పడం వల్లే ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement