IND VS ENG 1st Test Day 5: వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్‌ | IND VS ENG 1st Test, Day 5: Rain Stops Play When England Need 190 Runs To Win | Sakshi
Sakshi News home page

IND VS ENG 1st Test Day 5: వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్‌

Jun 24 2025 7:24 PM | Updated on Jun 24 2025 7:54 PM

IND VS ENG 1st Test, Day 5: Rain Stops Play When England Need 190 Runs To Win

వరుణుడి ఆటంకం తర్వాత తిరిగి మొదలైన మ్యాచ్‌
వర్షం పాక్షిక అంతరాయం కలిగించిన తర్వాత మ్యాచ్‌ మళ్లీ మొదలైంది. రెండో ఓవర్‌లోనే ప్రసిద్ద్‌ కృష్ణ జాక్‌ క్రాలేను (65) ఔట్‌ చేశాడు. ఇంగ్లండ్‌ గెలుపుకు ఇంకా 183 పరుగులు చేయాలి. భారత్‌ గెలవాలంటే మరో 9 వికెట్లు తీయాలి. 

లీడ్స్‌ వేదికగా భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న తొలి టెస్ట్‌ మ్యాచ్‌ వర్షం​ కారణంగా నిలిచిపోయింది. చివరి రోజు ఇంగ్లండ్‌ 371 పరుగుల లక్ష్యాన్ని ఛేదిస్తుండగా.. రెండో సెషన్‌లో వర్షం మొదలైంది. వర్షం మొదలయ్యే సమయానికి ఇంగ్లండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్‌ కోల్పోకుండా 181 పరుగులు చేసింది. 

బెన్‌ డకెట్‌ (105) సెంచరీ పూర్తి చేసి ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా మరో ఓపెనర్‌ జాక్‌ క్రాలే (59) బాధ్యతాయుతంగా ఆడుతూ క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ విజయం దిశగా సాగుతున్న వేల వరుణుడు అడ్డుపడ్డాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ గెలవాలంటే మరో 190 పరుగులు చేయాల్సి ఉంది. భారత్‌ గెలవాలంటే 10 వికెట్లు తీయాలి.

స్కోర్‌ వివరాలు.. 
భారత్‌: 471 (జైస్వాల్‌ 101, గిల్‌ 147, పంత్‌ 134) & 364 (రాహుల్‌ 137, పంత్‌ 118)
ఇంగ్లండ్‌: 465 (పోప్‌ 106, బ్రూక్‌ 99) & 117/0 (డకెట్‌ 105 నాటౌట్‌, క్రాలే 59 నాటౌట్‌)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement