టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడ్డాయి. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది.
ఈ క్రమంలో లక్ష్య ఛేదనకు దిగిన ఆసీస్.. 18.2 ఓవర్లలో కేవలం 119 పరుగులే చేసి ఆలౌట్ అయింది. ఫలితంగా టీమిండియా 48 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా ఐదు మ్యాచ్ల సిరీస్లో 2-1తో ఆధిక్యంలోకి దూసుకువెళ్లింది.
వారెవ్వా వాషీ.. అదరగొట్టిన అక్షర్, శివం
లక్ష్య ఛేదనలో ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్ (30), మాథ్యూ షార్ట్ (25) ఫర్వాలేదనిపించగా.. మిగిలిన వాళ్లంతా భారత బౌలర్ల ధాటికి తాళలేక చేతులెత్తేశారు. జోష్ ఇంగ్లిస్ (12), టిమ్ డేవిడ్ (14), జోష్ ఫిలిప్ (10), మార్కస్ స్టొయినిస్ (17) తీవ్రంగా నిరాశపరచగా.. గ్లెన్ మాక్స్వెల్ (2), బెన్ డ్వార్షుయిస్ (5), జేవియర్ బార్ట్లెట్ (0), నాథన్ ఎల్లిస్ (2 నాటౌట్), ఆడం జంపా (0) ఇలా వచ్చి అలా వెళ్లారు.
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ మూడు వికెట్లతో చెలరేగగా.. అక్షర్ పటేట్, శివం దూబే చెరో రెండు వికెట్లు తీశారు. అర్ష్దీప్ సింగ్, బుమ్రా, వరుణ్ చక్రవర్తి తలా ఒక వికెట్ దక్కించుకున్నారు.
ఆసీస్ ఆలౌట్
18.2: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో జంపా (0).. గిల్కు క్యాచ్ ఇవ్వడంతో ఆసీస్ పదో వికెట్ కోల్పోయింది. దీంతో భారత్ విజయం ఖరారైంది.
తొమ్మిదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
17.6: బుమ్రా బౌలింగ్లో బౌల్డ్ అయి తొమ్మిదో వికెట్గా వెనుదిరిగిన డ్వార్షుయిస్ (5). స్కోరు: 118-9(18). విజయానికి చేరువైన టీమిండియా.
ఎనిమిదో వికెట్ డౌన్
16.5: వాషీ బౌలింగ్లో బార్ట్లెట్ బౌల్డ్ (0). ఎనిమిదో వికెట్ కోల్పోయిన ఆసీస్. స్కోరు: 116-8(16.5). ఆసీస్ విజయానికి 19 బంతుల్లో 52 పరుగులు కావాల్సి ఉండగా.. టీమిండియాకు కేవలం రెండు వికెట్లు కావాలి.
ఏడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
16.4: వాషింగ్టన్ సుందర్ బౌలింగ్లో స్టొయినిస్ (17) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. దీంతో ఆసీస్ ఏడో వికెట్ కోల్పోయింది.
ఆరో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
14.6: వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో మాక్స్వెల్ బౌల్డ్ (4 బంతుల్లో 2). దీంతో ఆసీస్ ఆరో వికెట్ కోల్పోయింది. డ్వార్షుయిస్ క్రీజులోకి రాగా.. స్టొయినిస్ 8 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 103-6 (15).
ఐదో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
13.1: ఫిలిప్ (10 బంతుల్లో 10) రూపంలో ఆసీస్ ఐదో వికెట్ కోల్పోయింది. అర్ష్దీప్ బౌలింగ్లో అతడు వరుణ్ చక్రవర్తికి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. స్కోరు: 98-5(13.1). స్టొయినిస్ ఐదు పరుగులతో ఉండగా.. మాక్స్వెల్ క్రీజులోకి వచ్చాడు.
నాలుగో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
11.3: శివం దూబే బౌలింగ్లో సూర్యకుమార్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన టిమ్ డేవిడ్ (9 బంతుల్లో 14). స్కోరు: 91-4(11.3). జోష్ ఫిలిప్ 8 పరుగులతో ఉండగా.. స్టొయినిస్క్రీజులోకి వచ్చాడు.
మూడో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
9.2: శివం దూబే బౌలింగ్లో మార్ష్ అర్ష్దీప్నకు క్యాచ్ ఇచ్చి మార్ష్ మూడో వికెట్గా వెనుదిరిగాడు. మార్ష్ 24 బంతుల్లో 30 పరుగులు చేశాడు. అతడి స్థానంలో జోష్ ఫిలిప్ క్రీజులోకి రాగా.. టిమ్ డేవిడ్ రెండు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 70-3(9.2).
రెండో వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
8.5: అక్షర్ పటేల్ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన ఇంగ్లిస్. 11 బంతులు ఎదుర్కొన్న ఈ వికెట్ కీపర్ బ్యాటర్ 12 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బౌల్డ్ అయ్యాడు. ఆసీస్ స్కోరు: 67-2(8.5). విజయానికి 67 బంతుల్లో 101 పరుగుల దూరంలో ఆసీస్ ఉండగా.. టీమిండియాకు ఎనిమిది వికెట్లు కావాలి. టిమ్ డేవిడ్ క్రీజులోకి రాగా.. మార్ష్ 30 పరుగులతో ఉన్నాడు.
తొలి వికెట్ కోల్పోయిన ఆస్ట్రేలియా
4.5: అక్షర్ పటేల్ బౌలింగ్లో ఆసీస్ ఓపెనర్ మాథ్యూ షార్ట్ లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరిగాడు. అయితే, ఫీల్డ్ అంపైర్ దీనిని నాటౌట్గా ప్రకటించగా.. టీమిండియా రివ్యూకు వెళ్లి విజయవంతమైంది. దీంతో ఆసీస్ తొలి వికెట్ కోల్పోయింది. ఇంగ్లిస్ క్రీజులోకి రాగా.. మార్ష్ 12 పరుగులతో ఉన్నాడు. ఆసీస్ స్కోరు: 39-1(5).
రెండు ఓవర్లలో ఆసీస్ స్కోరు: 11-0
షార్ట్ ఆరు, మార్ష్ ఐదు పరుగులతో ఉన్నారు.
ఆసీస్ టార్గెట్ ఎంతంటే?
క్వీన్స్ లాండ్ వేదికగా ఆసీస్తో జరుగుతున్న నాలుగో టీ20లో భారత బ్యాటర్లు రాణించారు. టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. ఓ దశలో 200 పరుగుల మార్క్ను దాటేలా కన్పించిన మెన్ ఇన్ బ్లూ.. వరుస క్రమంలో వికెట్లు కోల్పోవడంతో ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది.
భారత ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్(46) టాప్ స్కోరర్గా నిలవగా..అభిషేక్ శర్మ(28), శివమ్ దూబే(22), సూర్యకుమార్(20), అక్షర్ పటేల్(21) రాణించారు. తిలక్ వర్మ(5), జితేష్ శర్మ(3) మాత్రం తీవ్ర నిరాశపరిచారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, జంపా తలా మూడు వికెట్లు పడగొట్టగా.. బార్ట్లెట్, స్టోయినిష్ తలా రెండు వికెట్లు సాధించాడు.
ఏడో వికెట్ డౌన్..
152 పరుగుల వద్ద భారత్ ఏడో వికెట్ కోల్పోయింది. 12 పరుగులు చేసిన వాషింగ్టన్ సెందర్.. ఎల్లీస్ బౌలింగ్లో ఔటయ్యాడు. 19 ఓవర్లు ముగిసే సరికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. క్రీజులో అర్ష్దీప్ సింగ్, అక్షర్ పటేల్(8) ఉన్నారు.
ఆరో వికెట్ కోల్పోయిన భారత్
16.4: జితేశ్ శర్మను జంపా వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఈ క్రమంలో జితేశ్ (4 బంతుల్లో 3) లెగ్ బిఫోర్ వికెట్గా వెనుదిరగగా.. అక్షర్ పటేల్ క్రీజులోకి వచ్చాడు. వాషీ ఐదు పరుగులతో ఉన్నాడు. స్కోరు: 136-6(16.5).
ఐదో వికెట్ డౌన్
16.1: ఆడం జంపా బౌలింగ్లో జోష్ ఇంగ్లిస్కు క్యాచ్ ఇచ్చిన తిలక్ వర్మ (6 బంతుల్లో 5) ఐదో వికెట్గా వెనుదిరిగాడు. వాషింగ్టన్ సుందర్ క్రీజులోకి రావడంతోనే ఫోర్ బాదగా.. జితేశ్ 3 పరుగులతో ఉన్నాడు. స్కోరు: 135-5(16.2)
నాలుగో వికెట్ కోల్పోయిన టీమిండియా
15.1: బార్ట్లెట్ బౌలింగ్లో టిమ్ డేవిడ్కు క్యాచ్ ఇచ్చి నాలుగో వికెట్గా వెనుదిరిగిన సూర్య (10 బంతుల్లో 20). స్కోరు: 125-4(15.1). జితేశ్ శర్మ క్రీజులోకి రాగా.. తిలక్ రెండు పరుగులతో ఉన్నాడు.
మూడో వికెట్ కోల్పోయిన భారత్
14.1: నాథన్ ఎల్లిస్ బౌలింగ్ గిల్(39 బంతుల్లో 46) బౌల్డ్. దీంతో భారత్ మూడో వికెట్ కోల్పోయింది. స్కోరు: 121-3(14.1). తిలక్ వర్మ క్రీజులోకి రాగా.. సూర్య 7 బంతులు ఎదుర్కొని 18 పరుగులతో ఉన్నాడు.
రెండో వికెట్ కోల్పోయిన భారత్
11.3: నాథన్ ఎల్లిస్ బౌలింగ్లో రెండో వికెట్గా వెనుదిరిగిన శివం దూబే. 18 బంతులు ఎదుర్కొన దూబే ఓ ఫోర్, ఓ సిక్సర్ సాయంతో 22 పరుగులు చేసి ఎల్లిస్ బౌలింగ్లో బౌల్డ్ అయ్యాడు. సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. స్కోరు: 88-2(11.3). గిల్ 34 పరుగులతో ఉన్నాడు.
పది ఓవర్ల ఆట ముగిసే సరికి భారత్ స్కోరు: 75-1.
శివం దూబే 11, గిల్ 33 పరుగులతో ఆడుతున్నారు.
భారత్ తొలి వికెట్ డౌన్..
6.4: 56 పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ కోల్పోయింది. 28 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. ఆడమ్ జంపా బౌలింగ్లో డేవిడ్కు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. క్రీజులోకి శివమ్ దూబే వచ్చాడు.
దూకుడుగా ఆడుతున్న గిల్..
4 ఓవర్లు ముగిసే సరికి భారత్ వికెట్ నష్టపోకుండా 31 పరుగులు చేసింది. ఓపెనర్లు శుభ్మన్ గిల్(18), అభిషేక్ శర్మ(12) దూకుడుగా ఆడుతున్నారు.
టీమిండియా- ఆస్ట్రేలియా క్వీన్స్లాండ్ వేదికగా నాలుగో టీ20లో తలపడుతున్నాయి. కరారా ఓవల్లో గురువారం నాటి మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్... తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఇక నాలుగో టీ20లో ఆస్ట్రేలియా ఏకంగా నాలుగు మార్పులు చేసింది.
ఆడం జంపా, గ్లెన్ మాక్స్వెల్, జోష్ ఫిలిప్, బెన్ డ్వార్షుయిస్లను తుదిజట్టుకు ఎంపిక చేసింది. ట్రావిస్ హెడ్, మిచెల్ ఓవెన్, సీన్ అబాట్, మాథ్యూ కుహ్నెమన్లను పక్కనపెట్టింది. మరోవైపు.. టీమిండియా మూడో టీ20లో ఆడిన జట్టునే కొనసాగించింది. దీంతో సంజూ శాంసన్కు మరోసారి మొండిచేయి తప్పలేదు.
1-1తో సమంగా
కాగా భారత్- ఆసీస్ మధ్య ఐదు మ్యాచ్ల టీ20 సిరీస్లో భాగంగా తొలి మ్యాచ్ వర్షార్పణం కాగా.. రెండో టీ20లో ఆస్ట్రేలియా గెలిచింది. ఈ క్రమంలో మూడో మ్యాచ్లో గెలవడం ద్వారా ప్రతీకారం తీర్చుకోవడంతో పాటు సూర్యసేన సిరీస్ను 1-1తో సమం చేసింది. ఇక నాలుగో టీ20లో గెలిచి ఆధిక్యం సంపాదించాలని ఇరుజట్లు పట్టుదలగా ఉన్నాయి.
తుదిజట్లు
భారత్
అభిషేక్ శర్మ, శుబ్మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్(కెప్టెన్), తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, జితేశ్ శర్మ(వికెట్ కీపర్), శివమ్ దూబే, అర్ష్దీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా
మిచెల్ మార్ష్(కెప్టెన్), మాథ్యూ షార్ట్, జోష్ ఇంగ్లిస్(వికెట్ కీపర్), టిమ్ డేవిడ్, జోష్ ఫిలిప్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్వెల్, బెన్ డ్వార్షుయిస్, జేవియర్ బార్ట్లెట్, నాథన్ ఎల్లిస్, ఆడమ్ జంపా.


