తెలంగాణ స్విమ్మర్లకు నాలుగు పతకాలు | Four medals for Telangana swimmers | Sakshi
Sakshi News home page

తెలంగాణ స్విమ్మర్లకు నాలుగు పతకాలు

Dec 5 2025 3:54 AM | Updated on Dec 5 2025 3:54 AM

Four medals for Telangana swimmers

సాక్షి, హైదరాబాద్‌: స్కూల్‌గేమ్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌జీఎఫ్‌ఐ) జాతీయ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌లో తెలంగాణ స్విమ్మర్లు నాలుగు పతకాలు సాధించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ పోటీల్లో అండర్‌–19 బాలుర విభాగంలో సుహాస్‌ ప్రీతమ్‌ 200 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో స్వర్ణ పతకం గెలిచాడు. సుహాస్‌ 2 నిమిషాల 06.28 సెకన్లలో రేసును ముగించి అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. 

కేరళ తరఫున బరిలోకి దిగిన ఆంధ్రప్రదేశ్‌ స్విమ్మర్‌ మొంగం తీర్థు సామ (2ని:11.24 సెకన్లు) కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. అండర్‌–19 బాలుర 400 మీటర్ల వ్యక్తిగత మెడ్లేలో తెలంగాణకు చెందిన ధూళిపూడి వర్షిత్‌ (4ని:40.41 సెకన్లు) రజత పతకం సంపాదించాడు. 

ఆంధ్రప్రదేశ్‌కు చెందిన మొంగం తీర్థు సామ (4ని:39.85 సెకన్లు) స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు. అండర్‌–17 బాలుర 50 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో తెలంగాణకు చెందిన ఇషాన్‌ దాస్‌ (25.93 సెకన్లు) రజతం, గౌతమ్‌ శశివర్ధన్‌ (26.25 సెకన్లు) కాంస్యం సాధించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement