IPL 2026: ముంబై ఆటగాడికి ఊహించని అదృష్టం | CSK Summon Mumbai Player Amid Injuries In IPL 2026 | Sakshi
Sakshi News home page

IPL 2026: ముంబై ఆటగాడికి ఊహించని అదృష్టం

Apr 27 2026 5:46 PM | Updated on Apr 27 2026 5:48 PM

CSK Summon Mumbai Player Amid Injuries In IPL 2026

ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో చెన్నై సూపర్‌ కింగ్స్‌ గాయాల సమస్యలతో సతమతమవుతోంది. ఇప్పటికే పలువురు కీలక ఆటగాళ్లు జట్టుకు దూరం కావడంతో, చెన్నై యాజమాన్యం ముంబైకి చెందిన యువ ఆల్‌రౌండర్ ఆయుశ్‌ వర్తక్‌ను మిడ్-సీజన్ ట్రయల్స్‌కు పిలిచింది.

ఈ సీజన్‌లో చెన్నై పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు. కెప్టెన్ రుతురాజ్‌ నాయకత్వంలో ఎనిమిది మ్యాచ్‌ల్లో ఐదు పరాజయాలు చవిచూసింది. ప్లేఆఫ్స్ అవకాశాలు ఇంకా ఉన్నప్పటికీ, గాయాలు జట్టును తీవ్రంగా దెబ్బతీశాయి.

లెజెండరీ క్రికెటర్ ఎంఎస్‌ ధోని కాల్ఫ్ స్ట్రెయిన్ కారణంగా ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. మరోవైపు ఆయుశ్‌ మాత్రే, ఖలీల్‌ అహ్మద్‌ గాయాల కారణంగా టోర్నీ మొత్తానికి దూరమయ్యారు.

ఈ నేపథ్యంలో ముంబై, పార్సీ జింఖానాకు ప్రాతినిధ్యం వహిస్తున్న అయుష్ వర్తక్‌ను చెన్నై ట్రయల్స్‌కు పిలిచింది. అతడు త్వరలోనే చెన్నై జట్టుతో కలవనున్నాడు.

21 ఏళ్ల అయుష్ వర్తక్ దేశీయ క్రికెట్‌లో ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందాడు. కుడిచేతి మీడియం పేసర్‌గా, దిగువ వరుసలో వేగంగా పరుగులు చేసే బ్యాటర్‌గా మంచి పేరు సంపాదించాడు.

నవి ముంబై టీ20 లీగ్‌లో అతడు 264 పరుగులు చేసి, 191 స్ట్రైక్‌రేట్ నమోదు చేశాడు. అదనంగా మూడు వికెట్లు కూడా పడగొట్టాడు. ఈ ప్రదర్శనతో సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు.

ఇప్పటికే ఆకాశ్‌ మధ్వాల్‌ను అయుష్ మాత్రే స్థానంలో జట్టులోకి తీసుకున్న చెన్నై, ఖలీల్ అహ్మద్‌కు ప్రత్యామ్నాయం కోసం అన్వేషిస్తోంది. ఆ లోటును వర్తక్ భర్తీ చేసే అవకాశం ఉంది.

ప్రస్తుతం చెన్నై జట్టులో డెవాల్డ్‌ బ్రెవిస్‌, నాథన్‌ ఇల్లిస్‌, స్పెన్సర్‌ జాన్సన్‌ కూడా గాయాలతో ఇబ్బంది పడుతున్నారు.

ప్లేఆఫ్స్ రేసులో నిలవాలంటే చెన్నై ఇకపై ప్రతి మ్యాచ్‌ను గెలవాల్సిందే. ఈ క్లిష్ట సమయంలో అయుష్ వర్తక్ వంటి యువ ఆటగాళ్లు జట్టుకు కొత్త ఉత్సాహాన్ని తీసుకురావాలని అభిమానులు ఆశిస్తున్నారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement