జిల్లా కేంద్రంలోని టీటీడీ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన సదరాని(దివ్యాంగుల వైకల్య నిర్ధ్దారణ పరీక్షల శిబిరం)కి అనూహ్య స్పందన లభించింది. వివిధ రకాల వైకల్య సమస్యలతో బాధపడుతున్న 290 మంది హాజరయ్యారు. వీరికి ఆర్థోపెడిక్, న్యూరో సర్జన్, రేడియాలిజిస్టులు పరీక్షలు నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం చేయూత ఆసరా పథకం దరఖాస్తులు ఆహ్వానిస్తున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున దివ్యాంగులు తరలించారు. శిబిరాన్ని జిల్లా వైద్యాధికారి ధనరాజ్, అదనపు డీఆర్డీఓ సుధీర్లు పరిశీలించారు. –సిద్దిపేటజోన్


