ముమ్మరంగా డిజిటల్‌ క్రాప్‌ సర్వే | - | Sakshi
Sakshi News home page

ముమ్మరంగా డిజిటల్‌ క్రాప్‌ సర్వే

Sep 4 2026 7:29 AM | Updated on Sep 4 2026 7:29 AM

జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి

జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి

తొగుట(దుబ్బాక): పంటసాగు వివరాల కోసం చేపట్టిన డిజిటల్‌ క్రాప్‌ సర్వే జిల్లాలో ముమ్మరంగా సాగుతోందని జిల్లా వ్యవసాయాధికారి స్వరూపరాణి తెలిపారు. మండలంలోని బండారుపల్లిలో డిజిటల్‌ క్రాప్‌ సర్వేను ఆమె మంగళవారం పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ భూముల్లో ఏ పంట.. ఎంతవిస్తీర్ణంలో సాగుచేశారనే వివరాలను నమోదు చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించడానికి పంట నష్టం జరిగితే పరిహారం, బీమా పొందడానికి ఈ క్రాప్‌ బుకింగ్‌ డేటా అత్యంత కీలకమన్నారు. రాయితీ ఎరువులు, విత్తనాల కేటాయింపులకు కూడా ఇదే ప్రామాణికం కానున్నదని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement