న్యూస్రీల్
ఆదివారం శ్రీ 31 శ్రీ మే శ్రీ 2026
రాయపోల్లో..
దౌల్తాబాద్లో దారి పొడవునా నిలిచిన ధాన్యం వాహనాలు
ధాన్యం సేకరణకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. కొనుగోలు కేంద్రాల్లో కాంటాలు అవుతున్నా.. తీసుకెళ్లిన ధాన్యం మిల్లులు, గోదాంల వద్ద అన్లోడ్ కావడం లేదు. దౌల్తాబాద్ మండలం అహ్మద్నగర్ పత్తి మిల్లు వద్ద శనివారం కిలోమీటర్ మేర లారీలు నిలిచిపోయాయి. అటు రాయపోల్ మండలం తిమ్మక్కపల్లి వరకు వాహనాలు ధాన్యంతో స్తంభించాయి. ఆయా గ్రామాల సెంటర్ల నుంచి ధాన్యం తీసుకువచ్చి మూడు రోజుల పాటు రైతులు మిల్లుల వద్ద తిండీ తిప్పలు లేక అవస్థలు పడుతున్నారు. దారి పొడవునా వాహనాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు వేగవంతం చేయాలని రైతులు కోరుతున్నారు. – దుబ్బాకటౌన్


