అనంతసాగర్లో
ఆలయంలో తహసీల్దార్ నిర్మల, దళితులు
గజ్వేల్: జగదేవ్పూర్ మండలం అనంతసాగర్లో దళితులను దుర్గమ్మ ఆలయ బోనాల కార్యక్రమంలో పాల్గొనకుండా అడ్డుకున్న ఘటనపై అధికారులు చర్యలకు ఉపక్రమించారు. సోమవారం తహసీల్దార్ నిర్మల ఆధ్వర్యంలో దళితులచే ఆలయ ప్రవేశం చేయించారు. కులవివక్షత చట్టరీత్య నేరమని, అంతా కలిసిమెలిసి ఉండాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్లు, తదితరులు పాల్గొన్నారు.
చిన్నకోడూరు(సిద్దిపేట): చిన్నకోడూరులో సోమవారం హనుమాన్ మాలధారులు, భక్తులు భారీ హనుమాన్ విగ్రహంతో గ్రామంలో శోభాయాత్ర నిర్వహించారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తూ.. జై శ్రీరాం, జై హనుమాన్ నినాదాలతో శోభాయాత్ర సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దళితుల
ఆలయ ప్రవేశం


