
శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం
u
u
u
నాచారం పీఠాధిపతి
మధుసూదనానంద సరస్వతి
శాంభవిదేవి అలంకరణలో
మహంకాళీ మాత
● మహాచండీదేవిగా అమ్మవారు దర్శనం ● నేడు మూల మహోత్సవం
మహాలక్ష్మి స్వరూపిణిగా..
విద్యుద్దీపాల వెలుగుల్లో వర్గల్ క్షేత్రం
వర్గల్(గజ్వేల్): శంభునికొండ దేదీప్యమానమైంది. విద్యుత్ దీపాలతో వర్గల్ క్షేత్రం కాంతు లీనుతోంది. దసరాశరన్నవరాత్రి ఉత్సవాలో భాగంగా ఆదివారం అమ్మవారు మహాచండీదేవి అలంకారంలో భక్తజనావళికి దర్శనమిచ్చారు. ఆలయ వ్యవస్థాపక చైర్మన్ చంద్రశేఖరసిద్ధాంతి నేతృత్వంలో అమ్మవారికి మహాభిషేకం, రాజోపచార, షష్ట్యుపచార పూజలు నిర్వహించారు. భక్తజనులు అమ్మవారిని దర్శించుకుని తరించారు.
నేడు విశేషపూజలు, అక్షరస్వీకారాలు
ఉత్సవాలలో అత్యంత ప్రధానమైన మూల మహోత్సవానికి వర్గల్ క్షేత్రం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంది. సోమవారం అమ్మవారు సరస్వతీదేవిగా నిజరూప దర్శనమిస్తారు. రంగంపేట, పుష్పగిరి పీఠాధిపతులు మాధవానంద సరస్వతి, శ్రీవిద్యాశంకర భారతి స్వామి తదితర ప్రముఖులు హాజరు కానున్నారు. రోజంతా విశేష పూజా కార్యక్రమాలు జరుగుతాయి. రాష్ట్ర నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు పోటెత్తనున్నారు. భారీసంఖ్యలో చిన్నారుల అక్షరాభ్యాసాలు జరుగుతాయి. ఇందుకు అనుగుణంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.
కొండపాక(గజ్వేల్): మర్పడ్గలో విజయదుర్గ సమేత సంతాన మల్లికార్జున స్వామి క్షేత్రంలో శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఆదివారం అమ్మవారు మహాలక్ష్మి స్వరూపిణిగా దర్శనం ఇచ్చారు. ఉదయం 6 గంటలకు క్షేత్రం నిర్వాహకులు చెప్పెల హరినాథ శర్మ ఆధ్వర్యంలో విశేష పూజలు నిర్వహించారు. మహిళలు లక్ష పుష్పార్పన చేశారు. భక్తులు భారీ సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకుని తరించారు.
అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి
గజ్వేల్రూరల్: అమ్మవారి ఆశీస్సులు భక్తులపై ఎళ్లప్పుడూ ఉండాలని నాచారం క్షేత్రం పీఠాధిపతి మధుసూదనానంద సరస్వతి స్వామివారు అన్నారు. శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆదివారం పట్టణంలోని మహంకాళీ దేవాలయంలో అమ్మవారు శాంభవిదేవి అలంకరణలో భక్తులకు దర్శనమివ్వగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో చేపడుతున్న రాజశ్యామల ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా మధుసూదనానంద సరస్వతి స్వామివారు మాట్లాడుతూ ప్రస్తుత యాంత్రిక జీవనంలో కొంత సమయం దైవచింతనకు కేటాయించాలన్నారు.
సామూహిక కుంకుమార్చన
నంగునూరు(సిద్దిపేట): దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారు మహచండీగా దర్శనమిచ్చారు. బద్దిపడగలో వీరసావర్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విగ్రహం వద్ద మహిళలు సామూహిక కుంకుమార్చన చేశారు.

శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం

శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం

శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం

శోభాయమానం.. విద్యాధరి క్షేత్రం