అర్జీల పరిష్కారానికి కృషి | - | Sakshi
Sakshi News home page

అర్జీల పరిష్కారానికి కృషి

Sep 23 2025 11:12 AM | Updated on Sep 23 2025 11:12 AM

అర్జీల పరిష్కారానికి కృషి

అర్జీల పరిష్కారానికి కృషి

● అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌ ● వచ్చిన దరఖాస్తులు 174

● అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌ ● వచ్చిన దరఖాస్తులు 174

సిద్దిపేటరూరల్‌: ప్రజావాణి కార్యక్రమంలో స్వీకరించిన అర్జీలను సత్వరం పరిష్కరించనున్నట్లు అదనపు కలెక్టర్‌ గరీమా అగర్వాల్‌ తెలిపారు. ఈ మేరకు అధికారులకు దిశానిర్దేశం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లోని మీటింగ్‌ హాల్‌ లో నిర్వహించిన ప్రజావాణిలో గరీమా అగర్వాల్‌ అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అర్జిదారులకు న్యాయం జరిగేలా పని చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో భూ సంబంధిత, హౌసింగ్‌, పెన్షన్లు వంటి ఇతర అర్జీలు మొత్తం 174 వచ్చాయి. కార్యక్రమంలో డీఆర్‌ఓ నాగరాజమ్మ, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement