
బాలసదనంలో లీగల్ అవేర్నెస్
సిద్దిపేటజోన్: జిల్లా కేంద్రంలోని బాలసదనంలో గురువారం లీగల్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి ఆదేశాల మేరకు జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీ, న్యాయమూర్తి స్వాతి రెడ్డి హాజరై పిల్లలకు చట్టాలు, చదువు విలువ గూర్చి వివరించారు. సమస్యలు ఉంటే 15100 నంబర్కు ఫోన్ చేయాలని సూచించారు. బాలసదనంలో ఉన్న పిల్లల యోగ క్షేమాల గూర్చి ఆరా తీశారు. అలాగే సిబ్బంది హాజరు రిజిస్టర్ను తనిఖీ చేశారు. భోజనం నాణ్యత, వంటగది, నిల్వ ఉన్న ఆహార పదార్థాలను పరిశీలించారు. అనంతరం ఆమె శిశు కేంద్రాన్ని సందర్శించారు.