ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి | - | Sakshi
Sakshi News home page

ధాన్యం కొనుగోలు ప్రారంభించాలి

Apr 16 2024 6:45 AM | Updated on Apr 16 2024 6:45 AM

ఆకునూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని
పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు - Sakshi

ఆకునూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలిస్తున్న సీపీఎం నాయకులు

కొంగరి వెంకట్‌మావో

చేర్యాల(సిద్దిపేట): మండలంలోని ఆకునూర్‌లో ధాన్యం కొనగోలు ప్రారంభించాలని సీపీఐ(యం)మండల కార్యదర్శి కొంగరి వెంకట్‌ మావో డిమాండ్‌ చేశారు. సోమవారం ఆకునూరు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఇతర నాయకులతో కలసి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని నామ మాత్రంగా ప్రారంభించారని, తాగునీరు, గన్నీబ్యాగులు, జల్లి మిషన్‌లు అందుబాటులో లేవని వాపోయారు. అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో శ్రీకాంత్‌, ఐలయ్య, భూమయ్య, కనకయ్య పాల్గొన్నారు.

చేర్యాల(సిద్దిపేట)లో..

స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ధాన్యం కొనగోలు వేగవంతం చేయాలని రాష్ట్ర రైతు సంఘం మండల కార్యదర్శి కత్తుల భాస్కర్‌ రెడ్డి కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి పది రోజులైనా కొనుగోలు ప్రారంభించలేదని మండిపడ్డారు. రాములు, లింగయ్య, మల్లవ్వ, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement