ఝరాసంగం(జహీరాబాద్): గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ క్రాంతి కుమార్ పాటిల్ తెలిపారు. వివరాల ప్రకారం.. మండల పరిధిలోని తుమ్మన్ పల్లి గ్రామ శివారులో ఉన్న ఓ రేకుల షెడ్డులో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్నారని సమాచారం అందిందిం. ఈ మేరకు పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్న నవాజ్ రెడ్డి, షేక్ సోహెల్, సురేష్, పిల్లోడి సాయికుమార్, ఫయాజ్, శ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు వారి నుంచి రూ. 24,440లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు.


