రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ కమిషనర్
హత్నూర(సంగారెడ్డి): ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ అసిస్టెంట్ కమిషనర్ మనోజ్కుమార్ అన్నారు. బుధవారం మండలంలోని వడ్డేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ధాన్యం కొనుగోలు కేంద్రంలో తూకం వేసిన ధాన్యాన్ని వెనువెంటనే రైస్ మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. లారీల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. తడిసిన ధాన్యంను వెంటనే రైస్ మిల్లుకు పంపించాలని చెప్పారు. డీఎస్ఓ అనుదీప్, మహేశ్, కమిటీ సభ్యులు, రైతులు ఉన్నారు.


