ఉజ్వల్‌ వైపే మొగ్గు! | - | Sakshi
Sakshi News home page

ఉజ్వల్‌ వైపే మొగ్గు!

Nov 26 2025 11:04 AM | Updated on Nov 26 2025 11:04 AM

ఉజ్వల్‌ వైపే మొగ్గు!

ఉజ్వల్‌ వైపే మొగ్గు!

● సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన దామోదర ● సంగారెడ్డి డీసీసీ పదవి విషయంపై చర్చ! ● రెండు, మూడు రోజుల్లో ప్రకటన

● సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన దామోదర ● సంగారెడ్డి డీసీసీ పదవి విషయంపై చర్చ! ● రెండు, మూడు రోజుల్లో ప్రకటన

సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: జిల్లా కాంగ్రెస్‌ కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి పీటముడి వీడనుంది. ఈ విషయంలో నెలకొన్న ఉత్కంఠకు త్వరలోనే తెరపడనుంది. జహీరాబాద్‌ పార్లమెంట్‌ నియోజకవర్గం ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్న డాక్టర్‌ ఉజ్వల్‌రెడ్డికే ఈ పదవి దక్కే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ మేరకు రెండు, మూడు రోజుల్లో అధినాయకత్వం నుంచి ప్రకటన వెలువడనుందని హస్తం పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పదవి విషయంలో మొదటినుంచి ఉజ్వల్‌రెడ్డి వైపే మొగ్గుచూపుతున్న సంగతి తెలిసిందే. ఉజ్వల్‌రెడ్డిని ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డి వద్దకు తీసుకెళ్లిన దామోదర ఈ పదవి విషయంలో సీఎంతో ప్రత్యేకంగా చర్చించారు. ఏఐసీసీ అగ్రనేత మల్లికార్జునఖర్గేతో కూడా మంత్రి చర్చించనున్నట్లు తెలుస్తోంది. సంగారెడ్డితోపాటు, పెండింగ్‌లో ఉన్న రంగారెడ్డి డీసీసీ అధ్యక్ష పదవులపై రెండు రోజుల్లో అధిష్టానం నుంచి ప్రకటన వెలువడనున్నట్లు ఆ పార్టీ నాయకులు పేర్కొంటున్నారు.

ఉజ్వల్‌కు దామోదర బాసట

రానున్న రోజుల్లో ఎంతో కీలకంగా మారనున్న డీసీసీ అధ్యక్ష పదవి విషయంలో ఉజ్వల్‌రెడ్డి వైపే మంత్రి దామోదర మొగ్గు చూపుతున్నారు. అనూహ్యంగా ఈ పదవి నియామకం విషయంలో అధినాయకత్వం ఈసారి అభిప్రాయ సేకరణ చేపట్టిన విషయం విదితమే. అన్ని జిల్లాల డీసీసీలను ప్రకటించిన అధిష్టానం సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాలను పెండింగ్‌లో పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఒకవిధంగా మంత్రి దామోదర రాజనర్సింహకు ప్రతిష్టాత్మక అంశంగా మారింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement