రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం

Jun 15 2026 7:34 AM | Updated on Jun 15 2026 7:34 AM

రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నాం

చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి

చందానగర్‌ : రాష్ట్రంలో 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నామని చేవెళ్ళ పార్లమెంట్‌ సభ్యులు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం హఫీజ్‌పేట్‌ రైల్వే స్టేషన్‌లో చేపట్టిన అభివృద్ధి పనులను బీజేపీ రంగారెడ్డి అర్బన్‌ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రవికుమార్‌ యాదవ్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..12 సంవత్సరాల మోదీ పాలనలో రైల్వే వ్యవస్థలో కీలక మార్పులు వచ్చాయన్నారు. కొత్త లైన్ల నిర్మాణం, రైల్వే స్టేషన్ల అభివృద్ధి పనులు నిరంతరం జరుగుతూనే ఉన్నాయన్నారు.హఫీజ్‌పేట్‌, హైటెక్‌ సిటీ స్టేషన్లు రూ.80 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిన ఘనత కేంద్ర ప్రభుత్వానిదన్నారు. కార్యక్రమంలో సీనియర్‌ నాయకులు బుచ్చిరెడ్డి, కేశవులు, అనిల్‌ గౌడ్‌, రామరాజు పాల్గొన్నారు.

చీరకు ఆర్డర్‌ పెడితే ఖాతా ఖాళీ అయ్యింది

బంజారాహిల్స్‌: ఇన్‌స్ట్రాగామ్‌ పేజీలో ఆకర్షణీయమైన ఓ చీరకు ఆర్డర్‌ పెడితే యువతిని సైబర్‌ మోసగాళ్లు లింక్‌ పంపించి ఖాతా ఖాళీ చేశారు. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌ రోడ్డునెంబర్‌–10లోని వెంకటగిరిలో నివసించే ఏ.శిల్ప అనే మహిళ ఇన్‌స్ట్రాగామ్‌ పేజీ చూసి ఓ చీరను ఆర్డర్‌ చేసింది. అయితే చీర డెలివరీ కాకపోవడంతో వెంటనే సంబంధిత విక్రేతకు ఫోన్‌ చేసింది. వెంటనే అవతలి వ్యక్తి నుంచి హైదరాబాద్‌ సిల్క్‌ శారీస్‌ పేరుతో రీఫండ్‌ లింక్‌ వచ్చింది. ఇది నమ్మిన ఆమె వెంటనే లింక్‌ నొక్కగా కొద్దిసేపట్లోనే ఆమె బ్యాంక్‌ ఖాతా నుంచి నగదు బదిలీ అయ్యింది. దీంతో బాధితురాలు వెంటనే సిమ్‌కార్డును బ్లాక్‌ చేసింది. అప్పటికే సైబర్‌ మోసగాళ్లు ఆమె ఖాతా నుంచి రూ.37,447 ఖాళీ చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement