సమయపాలన పాటించాలి
పూడూరు: ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగేలా చూడాల్సిన బాధ్యత వైద్యులపై ఉందని డీఎంహెచ్ఓ స్వర్ణకుమారి అన్నారు. బుధవారం మండలంలోని చన్గోముల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు రిజిస్టర్ను పరిశీలించారు. సమయపాలన పాటించాలని సూచించారు. పాము, తెలు, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ప్రసవాలు జరిగేలా అవగాహన కల్పించాలని ఏఎన్ఎంకు సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ మహమూద్ ఫారూకీ, ఆస్పత్రి సిబ్బంది రవికుమార్, దాసు తదితరులు పాల్గొన్నారు.


