కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి | - | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి

Oct 19 2025 8:27 AM | Updated on Oct 19 2025 8:27 AM

కేంద్

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి ఆమనగల్లు: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని శనివారం హైదరాబాద్‌లో జాతీయ బీసీ కమిషన్‌ మాజీ సభ్యుడు ఆచారి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈనెల 31న జరిగే తన కుమారుడు భరత్‌ నిశ్చితార్థానికి రావాలని ఆహ్వానించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు వెంకటయ్య, రాంరెడ్డి తదితరులు ఉన్నారు. లచ్చిరాంకు ఇంటర్నేషనల్‌ టీచర్‌ ఎక్సలెన్సీ అవార్డు తుర్కయంజాల్‌: ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేయడం, దాతల ద్వారా బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు సౌకర్యాలను సమకూర్చడం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని పురపాలక సంఘం పరిధి మునగనూర్‌కు చెందిన ఉదావత్‌ లచ్చిరాంకు ఇంటర్నేషనల్‌ టీచర్‌ ఎక్సలెన్సీ అవార్డు దక్కింది. ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా బీహార్‌కు చెందిన లీగ్‌ అకాడమిక్‌ ప్రొఫెషనల్‌ ఇంటర్‌ డిసిప్లినరీ సొసైటీ, నీరజ్‌ గ్రీన్‌ ఇండియా పరివార్‌ ఫౌండేషన్‌ సీఈఓలు డా. నీరజ్‌ గుప్తా, ప్రొఫెసర్‌ నార్బర్‌ శనివారం మెయిల్‌ ద్వారా సర్టిఫికెట్‌ పంపించినట్లు లచ్చిరాం తెలిపారు. ఈయన ప్రస్తుతం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలం దామెర భీమనపల్లి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. ఈ అవార్డు వరించడం ఎంతో సంతోషంగా ఉందని, మరింత ఉత్సాహంతో పేద విద్యార్థులకు చేయుత అందిస్తానని పేర్కొన్నారు. బాటసింగారం ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌గా జైపాల్‌రెడ్డి ప్రజా సంక్షేమమే ధ్యేయం

అబ్దుల్లాపూర్‌మెట్‌: రెండు నెలలుగా కొనసాగుతూ వస్తున్న బాటసింగారం రైతు సేవా సహకార సంఘం (ఎఫ్‌ఎస్‌సీఎస్‌) చైర్మన్‌ పదవీ వివాదం ఎట్టకేలకు ముగిసింది. చైర్మన్‌గా కొత్తపల్లి జైపాల్‌రెడ్డిని నియమిస్తూ జిల్లా సహకార శాఖ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఉత్తర్వు పత్రాన్ని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి శనివారం జైపాల్‌రెడ్డికి అందజేశారు. సంఘం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జైపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. సంఘంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించి అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.

పహాడీషరీఫ్‌: బస్తీల్లో సమస్యలు లేకుండా తగిన చర్యలు తీసుకుంటానని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి తెలిపారు. జల్‌పల్లి మున్సిపాలిటీ శ్రీరాం కాలనీలోని 20వ వార్డు ప్రజలు స్థానికంగా నెలకొన్న అవుట్‌లెట్‌ తదితర సమస్యల విషయమై ఎమ్మెల్యే సబితారెడ్డిని శనివారం ఉదయం ఆమె నివాసంలో కలిసి విన్నవించారు. స్పందించిన ఆమె వెంటనే కమిషనర్‌కు ఫోన్‌ చేయడంతో 40 మంది సిబ్బందితో పారిశుద్ధ్య పనులు చేపట్టారు. అనంతరం ఆమె నేరుగా శ్రీరాం కాలనీకి వచ్చి స్థానికంగా పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే ధ్యేయమని అన్నారు. బస్తీల్లో నెలకొన్న సమస్యలపై మున్సిపల్‌ సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అవుట్‌లెట్‌, దెబ్బతిన్న రహదారులకు సంబంధించి డీపీఆర్‌ రూపొందించాలని ఆదేశించారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌ సూరెడ్డి కృష్ణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ షర్ఫుద్దీన్‌ హామెద్‌, సీనియర్‌ నాయకులు నిరంజన్‌, యంజాల అర్జున్‌, దూడల శ్రీనివాస్‌ గౌడ్‌, నవపేట ఆంజనేయులు, కర్నాటి పద్మ, వాసుబాబు తదితరులు పాల్గొన్నారు.

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి 
1
1/2

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి 
2
2/2

కేంద్రమంత్రి కిషన్‌రెడ్డిని కలిసిన ఆచారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement