
● ఆయన కష్టమే ఈ జీవితం
దుద్యాల్: మండలంలోని గౌరారం గ్రామానికి చెందిన పిడుగు వెంకటయ్య –మాసనమ్మ దంపతులకు కొద్దిపాటి భూమి ఉంది. దీన్ని సాగు చేసుకుంటూ మరోవైపు వీఆర్ఏ ఉద్యోగం చేస్తూ ముగ్గురు కుమారులను బాగా చదివించారు. ప్రస్తుతం వారు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు. పెద్ద కొడుకు తిరుపతి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. రెండో కుమారుడు గోపాల్ విద్యుత్ శాఖలో లైన్మెన్గా బొంరాస్పేట్ మండలంలో విధులు నిర్వహిస్తున్నారు. మూడో కొడుకు శ్రీనివాస్ అబ్కారీ శాఖలో జూనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నారు. నాన్న కష్టమే ఈ రోజు తాము ఉన్నతమైన జీవనం సాగిస్తున్నామని వారు ఆనందం వ్యక్తం చేశారు.