
కేసుల పరిష్కారానికి రాజీయే మార్గం
సీనియర్ సివిల్ కోర్టు జడ్జిలు దశరథరామయ్య, శ్యాంకుమార్
చేవెళ్ల: రాజీమార్గం ద్వారా కక్షిదారులు తమ కేసులను పరిష్కరించుకోవాలని సీనియర్ సివిల్ కోర్టు జడ్జిలు దశరథరామయ్య, జె.శ్యాంకుమార్, రిటైర్డ్ జడ్జి కె.లక్ష్మణ్ అన్నారు. శనివారం చేవెళ్ల కోర్టు ఆవరణలో మెగా లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. క్షణికావేశంలో గొడవలు, ఘర్షణల కారణంగా సమయాన్ని వృథా చేసుకోవద్దని సూచించారు. భార్యాభర్తల కేసులు, కుటుంబ తగాదాలు, భూ సంబంధిత విషయాలను రాజీమార్గంలో పరిష్కరించుకోవాలని చెప్పారు.
1,271 కేసులకు రూ.16.62లక్షల జరిమానాలు
చేవెళ్ల కోర్టు ఆవరణలో ఈ నెల 9 నుంచి 14వ తేదీ వరకు నిర్వహించిన లోక్ అదాలత్లలో పెద్ద సంఖ్యలో కేసులు పరిష్కరించామన్నారు. ఆరు రోజుల్లో 1,271 కేసులు పరిష్కరించగా రూ.16,62,690 జరిమానా విధించామన్నారు. ట్రాఫిక్ విభాగానికి సంబంధించి 766 కేసులు పరిష్కారమయ్యాయన్నారు. సివిల్, క్రిమినల్, పిట్టి కేసులకు పరిష్కారం చూపామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సూపరింటెండెంట్లు ఈ.మహిపాల్, బి.కృష్ణవేణి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ కె.కుమార్. సీఐ భూపాల్శ్రీధర్, ట్రాఫిక్ ఏఎస్ఐ చందర్నాయక్, అడ్వకేట్స్ బి.కృష్ణ గౌడ్, బి.మల్లేశ్గౌడ్, నర్సింలు, ఉపేందర్, శేఖర్, సిబ్బంది అనిల్కుమార్, నర్సింలు, ఆనంద్కుమార్ తదితరులు ఉన్నారు.
152 కేసులకు పరిష్కారం
ఆమనగల్లు: పట్టణంలోని జ్యుడీషియల్ ఫస్ట్క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో 152 కేసులు పరిష్కారమయ్యాయి. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ స్వరూప కాటం మాట్లాడుతూ.. లోక్ అదాలత్లో ఇరువర్గాలు రాజీపడి కేసులను పరిష్కరించుకోవాలన్నారు. కోర్టుల చుట్టూ తిరగకుండా రాజీపడి పరిష్కరించుకుంటే ఇరువర్గాలు గెలిచినట్లేనన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీపీ కార్తీక్, సీఐ జానకీరాంరెడ్డి, గంగాధార్, వేణుగోపాల్, ఎకై ్సజ్ సీఐ బద్యానాథ్ చౌహాన్, ఎస్ఐలు వెంకటేశ్, శ్రీకాంత్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు యాదీలాల్, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ట్రాఫిక్ పోలీస్ కేసులు
డ్రంకెన్ డ్రైవ్ 544 రూ.10,76,500
లైసెన్స్, రిజిస్ట్రేషన్ 222 రూ.2,96,500

కేసుల పరిష్కారానికి రాజీయే మార్గం