గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యం
బోయినపల్లి(చొప్పదండి): రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పేర్కొన్నారు. రూ.20 లక్షల అంచనాలతో నిర్మించే మండలంలోని జగ్గారావుపల్లి జీపీ భవన నిర్మాణానికి సోమవారం భూమిపూజ చేశారు. అంతకుముందు పెద్దమ్మ ఆలయం సందర్శించారు. పీఆర్ డీఈ విష్ణువర్ధన్, తహసీల్దార్ శ్రీనివాస్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు సువీన్యాదవ్, సెస్ డైరెక్టర్ సుధాకర్, ఏఎంసీ చైర్మన్ ఎల్లేశ్యాదవ్, సర్పంచులు తదితరులు ఉన్నారు.


