కేసీఆర్‌ కప్‌ క్రికెట్‌ పోటీలు విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ కప్‌ క్రికెట్‌ పోటీలు విజయవంతం చేయాలి

Apr 7 2026 9:13 AM | Updated on Apr 7 2026 9:13 AM

కేసీఆర్‌ కప్‌ క్రికెట్‌ పోటీలు విజయవంతం చేయాలి సిరిసిల్ల అర్బన్‌: జిల్లాలో ఈనెల 10 నుంచి 25 వరకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే కేసీఆర్‌ కప్‌ క్రికెట్‌ పోటీలను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌ కోరారు. ఈమేరకు స్థానిక తెలంగాణ భవన్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో కలిసి క్రికెట్‌ పోటీల పోస్టర్‌ను సోమవారం ఆవిష్కరించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ము న్సిపల్‌ వైస్‌చైర్మన్‌ దార్ల సందీప్‌ పాల్గొన్నారు. దాడి చేసిన వ్యక్తి రిమాండ్‌ బోయినపల్లి(చొప్పదండి): పాత కేసు ఉపసంహరించుకోవాలని మండలంలోని జగ్గారావుపల్లికి చెందిన పొన్నం రాజుపై దాడి చేసిన అదే గ్రామానికి చెందిన బొజ్జ ధర్మయ్య అలియాస్‌ ధర్మేందర్‌ను రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై ఎన్‌.రమాకాంత్‌ సోమవారం తెలిపారు. గత సంవత్సరం వినాయక చవితి ఉత్సవాల సమయంలో రాజుతో జరిగిన గొడవ కారణంగా ధర్మయ్యపై కేసు నమోదు చేశారు. ఈ విషయం మనసులో పెట్టుకొని ధర్మయ్య ఈనెల 4న పొన్నం రాజు ఇంటికెళ్లి బీరు సీసాతో దాడి చేశాడు. అడ్డుకునేందుకు యత్నించిన రాజు కుమార్తైపె కూడా దాడి చేసి దుర్భాషలాడాడు. ఈ విషయంలో బాధితుడు రాజు ఫిర్యాదుతో బొజ్జ ధర్మయ్యను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ● రాజన్నకు రూ.116 కోట్లు

ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలి

సిరిసిల్ల ఎడ్యుకేషన్‌/సిరిసిల్ల టౌన్‌: ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు కల్పించాలని మున్సిపల్‌ చైర్మన్‌ జిందం కళాచక్రపాణిని పీఆర్టీయూ ప్ర తినిధులు కోరారు. చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి దంపతులను సన్మానించారు. యూని యన్‌ జిల్లా అధ్యక్షుడు గన్నమనేని శ్రీనివాసరావు, సీనియర్‌ నాయకులు దుబ్బాక ప్రభాక ర్‌, గుర్రం మల్లారెడ్డి, తిరుపతిరెడ్డి, జక్కని నవీ న్‌, గడ్డం శంకర్‌, యేముల ప్రతాప్‌, భగవాన్‌, జయరామ్‌, షఫీ, చంద్రశేఖర్‌, సాంబారెడ్డి, కూతురి కరుణాకర్‌రెడ్డి, శ్రీనివాస్‌ వెంగళ మ హేశ్‌, సత్యనారాయణ, ఆనంద్‌, పూర్ణచందర్‌, చిన్నభూమయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు.

తగ్గిన సమ్మక్క ఆదాయం

వేములవాడఅర్బన్‌: రెండేళ్లకోసారి జరిగే సమ్మ క్క జాతర సందర్భంగా వేములవాడ రాజన్న ఆదాయం ఈసారి రూ.3కోట్లు తగ్గింది. 2019–20లో రూ.85కోట్లు, 2021–22లో రూ.87కోట్లు, 2023–24లో రూ.11కోట్లు, 2025–26లో రూ.116కోట్లు సమకూరింది. 2025–26లో హుండీ ద్వారా రూ.28కోట్లు, కో డెమొక్కుల ద్వారా రూ.21కోట్లు, వడ్డీలు రూ.20కోట్లు, ప్రసాద విక్రయాలు రూ.20 కోట్లు, లీజులు లైసెన్సులు రూ.15కోట్లు, కల్యాణం రూ.3కోట్లు, బ్రేక్‌ దర్శనం శీఘ్ర ద ర్శనం రూ.3కోట్లు, ధర్మశాలల అద్దె రూ.3 కోట్లు, కేశఖండనం రూ.2కోట్లు, బద్దిపోచమ్మ ఆలయం రూ.కోటితో కలిసి రూ.116కోట్లు సమకూరినట్లు అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement