● డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్
సిరిసిల్ల అర్బన్: ప్రజాపాలనలో నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని జేపీనగర్లో శనివారం నిర్వహించిన గుండేటి అఖిల–కరుణాకర్ నిర్మించుకున్న ఇందిరమ్మ గృహప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యారు. గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్, 23వ వార్డు కౌన్సిలర్ ఆడెపు చంద్రకళ, సీనియర్ నాయకులు గడ్డం నర్సయ్య, వైద్య శివప్రసాద్, ఆడెపు వెంకటేశం, ఆకెన సతీశ్, ఎదురుగట్ల వనిత తదితరులు పాల్గొన్నారు.


