
పేదల డాక్టర్..
ముస్తాబాద్కు చెందిన డాక్టర్ చింతోజు శంకర్ 1971–72లో పదో తరగతి ఇక్కడే చదివారు. తన తండ్రి డాక్టర్ చింతోజు బ్రహ్మం, సోదరుడు చింతోజు రాజారాం స్ఫూర్తిగా కాకతీయ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్, ఉస్మానియాలో గైనకాలజీ కోర్సు చదివారు. 1982లోనే ముస్తాబాద్లో పీపుల్స్ హాస్పిటల్ స్థాపించారు. వేలాది మందికి చికిత్స అందించారు. ల్యాప్రోస్కోపిక్ సర్జరీల్లో శంకర్ అందెవేసిన చేయి అని అందరూ అంటుంటారు. లక్షకు పైగా ఆపరేషన్లు చేసిన ఘనత డాక్టర్ శంకర్ సొంతం. గ్రామీణ ప్రాంతంలో ఉంటూ 50 ఏళ్లుగా వైద్యసేవలు అందిస్తున్నారు. ఇటీవల రూ.2లక్షలు వెచ్చించి తాను చదువుకున్న పాఠశాలలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లు ఏర్పాటు చేయించారు.