ఆలనా.. పాలన | - | Sakshi
Sakshi News home page

ఆలనా.. పాలన

Jun 15 2025 9:15 AM | Updated on Jun 15 2025 9:15 AM

ఆలనా.

ఆలనా.. పాలన

మా తాత బంగారం

నాన్న.. ఒక ధైర్యం.. ఆరాధించే దైవం.. అమ్మ మనకు ప్రపంచాన్ని పరిచయం చేస్తే.. నాన్న ప్రపంచానికి మనల్ని పరిచయం చేస్తాడు. చిన్నతనంలో బుడిబుడి అడుగులు ఎలా వేయాలో నేర్పిస్తాడు. యుక్తవయసులో తప్పటడుగులు వేయకుండా సలహాలిస్తాడు. పిల్లలు స్థిరపడేందుకు జీవితకాలం కష్టపడే తండ్రి పిల్లల విజయాన్ని తన విజయంగా గర్వపడతాడు. పిల్లల జీవితాల్లో వెలుగునిచ్చేందుకు కొవ్వొత్తిలా కరిగిపోతాడు నాన్న.. ఇలా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో చాలా మంది తండ్రులు తమ పిల్లలు ఉన్నత శిఖరాలకు చేరేందుకు కష్టపడ్డారు. తాము పేదింట్లో పుట్టినా.. పిల్లలకు ఏ లోటూ లేకుండా చూసుకుని చదివించి, కొలువు కొట్టేలా చేశారు మరికొందరు. అనాథ పిల్లలను అక్కున చేర్చుకుని సపర్యలు చేస్తూ.. నాన్న అని పిలిపించుకుంటున్నారు మరికొందరు.. నేడు ఫాదర్స్‌డే సందర్భంగా ఆదర్శ తండ్రులపై సండే స్పెషల్‌.

అమెరికాలోని జార్జియాలో

స్థిరపడిన జగదీశ్‌, సతీశ్‌ దంపతులు

పిల్లలకు స్నానం చేయిస్తున్న

వీరస్వామి

జమ్మికుంట(హుజూరాబాద్‌): తల్లిదండ్రుల అకాలమరణంతో అనాథలైన పిల్ల లను అక్కున చేర్చుకొని చేరదీసి ఆదరిస్తున్నారు జమ్మికుంట మున్సిపల్‌ పరిధి కొత్తపల్లికి చెందిన ఆదర్శ దంపతులు గోపరాజు వీరస్వామి, శోభారాణి. వీరస్వామి చదువుకునే రోజుల్లో విప్లవ పార్టీలో పని చేశారు. తర్వాత వీరస్వామి, శోభారాణి ఆదర్శ వివాహం చేసుకున్నారు. అనాథ, నిరుపేద పిల్లలకు ఆశ్రయం కల్పించి, సేవ చేయాలనే సంకల్పంతో 2008లో ఏడుగురు పిల్లలతో స్పందన అనాథ బాలబాలికల సేవా సంస్థను ప్రారంభించారు. ప్రస్తుతం ఆశ్రమంలో 25 మంది అనాథ, నిరుపేద పిల్లలు ఉంటున్నారు. వారికి భోజనం, విద్య, వైద్యం, వసతి కల్పిస్తున్నారు. దాతలు చేయూత అందిస్తున్నారు. పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పి, వారు జీవితంలో స్థిరపడేలా సేవలు అందిస్తూ సేవ దృక్పథాన్ని చాటుతున్నారు. ప్రస్తుతం అద్దె ఇంట్లో ఆశ్రమం నిర్వహిస్తుండగా, ప్రభుత్వం స్థలం ఇస్తే స్థిర నివాసం ఏర్పాటు చేసి అనాథ పిల్లలకు అన్నీతామై, అమ్మానాన్న లోటు లేకుండా సేవ చేస్తామని నిర్వాహకులు వేడుకుంటున్నారు.

ధర్మపురి: కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు కొడుకును దత్తత తీసుకొని ఉన్నత చదువులు చదివించి అమెరికాలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకే యజమాని కావడం మా తాత చేసిన పుణ్యమే అంటున్నారు మనువలు. ధర్మపురికి చెందిన తన్నీరు నారాయణ తాపీమేసీ్త్ర. కొడుకులు లేకపోవడంతో చిన్న కూతురు కొడుకు జగదీశ్‌ను దత్తత తీసుకుని ఉన్నత చదువులు చదివించాడు. జగదీశ్‌తో పాటు చిన్న మనువడు సతీశ్‌ను ప్రయోజకులను చేశా డు. కూతురు బిడ్డలే తన బిడ్డలుగా భావించి ఇద్దరు మనుమలను ఎంసీఏ వరకు చది వించాడు. తాత చదివించిన ఉన్నత చదువులతో జగదీశ్‌ అమెరికాలోని జార్జియా రాష్ట్రంలో ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి అధిపతి అయ్యాడు. సతీశ్‌ కూడా జార్జియాలో టీసీఎస్‌ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌గా పని చేస్తూ నెలకు రూ.4 లక్షల వరకు సంపాదిస్తున్నారు. తమ తాత మృతిచెందినా ఆయన కృషి వల్లే ఉన్నతస్థాయికి ఎదిగామని పేర్కొన్నారు ఇద్దరు మనువలు.

అనాథలకు అన్నీ తామై..

– వివరాలు 8లోu

ఆలనా.. పాలన1
1/4

ఆలనా.. పాలన

ఆలనా.. పాలన2
2/4

ఆలనా.. పాలన

ఆలనా.. పాలన3
3/4

ఆలనా.. పాలన

ఆలనా.. పాలన4
4/4

ఆలనా.. పాలన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement