గజవాహనంపై విహారం
వేములవాడ: రాజన్న సన్నిధిలో నిర్వహిస్తున్న వసంత నవరాత్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాత్రి స్వామి ఉత్సవమూర్తులను గజవాహనంపై ఊరేగించారు. రాజన్నను డీసీసీ అధ్యక్షుడు ఆది శ్రీనివాస్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఏఎంసీ మాజీ చైర్మన్ ఏనుగు మనోహర్రెడ్డి దర్శించుకున్నారు. ఏర్పాట్లను ఏఈవో శ్రీనివాస్, పర్యవేక్షకులు తిరుపతిరావు,
అల్లి శంకర్, శ్రీరాములు పరిశీలించారు. కొత్తగూడెం ఏఎస్పీ సాయిమనోహర్ దంపతులు
దర్శించుకున్నారు. నాగిరెడ్డి మండపంలో ప్రసాదాలు అందించారు.