అదుపుతప్పి కారు బోల్తా | - | Sakshi
Sakshi News home page

అదుపుతప్పి కారు బోల్తా

Mar 24 2026 6:57 AM | Updated on Mar 24 2026 6:57 AM

అదుపుతప్పి కారు బోల్తా

ఒకరు మృతి

బల్లికురవ: కారు అదుపుతప్పి బోల్తా పడటంతో ఒకరు మృతి చెందారు. ఈ సంఘటన సోమవారం మేదరమెట్ల – నార్కెట్‌పల్లి నామ్‌ రహదారిలోని రామాంజనేయపురం గ్రామ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న కారు బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో కారు వెనక సీట్లో కూర్చున్న టి.సుబ్రమణ్యం (53) అక్కడికక్కడే మృతి చెందాడు. కారులో ప్రయాణిస్తున్న మరో ఇద్దరికి, డ్రైవర్‌కి ఎలాంటి గాయాలు కాలేదు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అద్దంకి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement