ఏపీలో పెట్రోల్, డీజిల్ సంక్షోభం మరింత ముదిరింది. మొన్న యూరియా.. నిన్న గ్యాస్.. నేడు ఇంధనం కొరత! సంక్షోభాలను పసిగట్టడంలో చంద్రబాబు సర్కారు దారుణంగా విఫలమైంది. రాష్ట్రంలో ఏ బంకు వద్ద చూసినా ‘నో స్టాక్’ బోర్డులే దర్శనమిచ్చాయి. దీంతో, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వాన్ని మొద్దు నిద్ర నుంచి మేల్కొపేందుకు వైఎస్సార్సీపీ నిరసనలకు సిద్ధమైంది. నేడు రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ బంకుల వద్ద నిరసలను పిలుపునిచ్చింది.

విజయవాడ..
- ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ కామెంట్స్..
- కూటమికి ఓట్లు వేసిన వాళ్లను చంద్రబాబు మోసం చేశాడు..
- సామాన్యుడు బాధ పడుతున్నారు..
- రైతులు యూరియా కోసం, పింఛన్ కోసం వృద్ధులు, రేషన్ కోసం మహిళలు, గ్యాస్ కోసం క్యూలో ప్రజలు నిలబడుతున్నారు
- ఓటమి ప్రభుత్వ వైఫల్యానికి నిరసనగా వైఎస్సార్సీపీ ఆందోళన చేస్తుంది..
- చంద్రబాబు ప్రభుత్వం చేతకాని ప్రభుత్వం..


- ప్రజలకు పెట్రోల్, డీజిల్ కూడా ఇవ్వలేక పోతుంది..
- చంద్రబాబు ప్రభుత్వం చేతకానితనాన్ని జనాలపై రుద్దే ప్రయత్నం చేస్తుంది..
- ఈరోజు నేను ఆలోచించింది రేపు భారత్ ఆలోచిస్తుంది అని చంద్రబాబు చెపుతున్నాడు..
- మంత్రులు విదేశాల్లో తిరుగుతున్నారు..
- జల్సా లకు, డబ్బా కొట్టు రాజకీయాలకు కూటమి నేతలు వున్నారు.
- పెట్రోల్ బంక్ వద్ద చంద్రబాబు, లోకేష్ నిల్చుంటే ప్రజలు ఏ విధంగా బూతులు తిడతారో తెలుస్తుంది..
- జగన్ను చూసి పరిపాలన ఏ విధంగా చేయాలో నేర్చుకోవాలి
- చేతగానితనాన్ని పక్కన పెట్టి పెట్రోల్, డీజిల్ సరఫరా చేయాలి..
- పెట్రోల్ బంకుల్లో స్టాక్ ఉంటేగా రేషన్ పద్దతి..
- రైతులు ఇబ్బందులు పడుతున్నారు..
- ఆటో వాళ్ళు, ట్రాక్టర్, రోజు వారి పనులు చేసుకొనే వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు..

తాడేపల్లి..
నేడు పెట్రోల్ బంకుల వద్ద వైఎస్సార్సీపీ నిరసనలు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలలోనూ నిరసన కార్యక్రమాలు
గత ఆరు రోజులుగా రాష్ట్రంలో డీజిల్, పెట్రోలు కొరత
ఏమాత్రం పట్టించుకోని చంద్రబాబు సర్కార్
ఎక్కడికక్కడ నిలిచిపోయిన రవాణా వాహనాలు
కోత మిషన్లు రాక డెల్టాలో నిలిచిపోయిన వరి కోతలు
డీజిల్ లేక 108 సేవలకూ ఆటంకాలు
ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఆందోళనలకు దిగిన వైఎస్సార్సీపీ.


