
విశాఖ : సింగయ్య మృతిపై టీడీపీ, ఎల్లో మీడియా అనవరసర రాద్దాంత సృష్టిస్తోందని వైఎస్సార్సీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. అసలు సింగయ్యను వైఎస్ జగన్ కాన్వాయ్లోని వాహనం ఢీకొట్టలేదని తొలుత చెప్పిన ఎస్పీ.. ఆపై మాట మార్చారన్నారు. ఎస్పీ ఇలా ఎందుకు చేశారో అందరికీ తెలుసని బొత్స పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం జిమ్మిక్కులు పక్కన పెట్టి.. ప్రజా సమస్యలపై ఇచ్చిన హామీలపై దృష్టి పెడితే మంచిదన్నారు.
ఈరోజు( సోమవారం,. జూన్ 23) విశాఖలో ప్రెస్మీట్ నిర్వహించిన బొత్స.. కూటమి ప్రభుత్వం తీరుపై ధ్వజమెత్తారు. ‘రెంటచింతలకు వైఎస్ జగన్ వెళ్ళినప్పుడు భారీగా అభిమానులు తరలి వచ్చారు.. సత్తెనపల్లి జగన్ వెళ్ళినప్పుడు పోలీసుల వైఫల్యం కనిపించింది.. పోలీసులు మాజీ సీఎంకు ఇవ్వాల్సిన భద్రత కల్పించలేదు. పోలీసులు ముందు ఒకమాట.. తరువాత మరో మాట మాట్లాడారు. ఎల్లో మీడియాలో కధనాలు వచ్చాక పోలీసులు ఆ దిశగా విచారణ చేస్తున్నారు. రాష్ట్రంలో దిక్కుమాలిన, దిగజారిన పాలన సాగుతుంది. సింగయ్యను కాన్వాయ్ వాహనం ఢీ కొట్టలేదని ఎస్పీ చెప్పారు..మళ్ళీ ఆయన మాట మార్చారు.
మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాఫ్యత ఉందా లేదా..?
రాష్ట్రంలో వ్యవస్థలు దిక్కుమాలిపోయాయి.. పాలన దిగజారిపోయింది. గాయలతో ఉన్న సింగయ్యను ప్రైవేటు వాహనంలో తరలిద్దాం అంటే 108 లోనే పంపిద్దాం అని పోలీసులు చెప్పిన మాట వాస్తవం కాదా?, పాలన వైఫల్యం కారణంగా పెద్ద ఎత్తున జగన్ పర్యటనలకు ప్రజలు తరలి వస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉండగా టీడీపీ సహా ఇతర పక్షాలు మూడేళ్లు కనపడలేదు. గురివింద గింజలా ఉంది మంత్రుల శైలి. మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వాల్సిన బాఫ్యత ఉందా లేదా..? సూటిగా ప్రశ్నిస్తున్నా. గతంలో బాబు, పవన్ లకు ఎప్పుడైనా భద్రతా ఇబ్బందులు ఉన్నాయా..?, ఇది ప్రజాస్వామ్యం ఎవరి సొత్తు కాదు. ప్రజాస్వామ్యంలో అందరికీ హక్కులు ఉన్నాయి. ప్రభుత్వ దయా దాక్షిణ్యాలు అవసరం లేదు. జగన్ వాహనం దగ్గర ఉండాల్సిన రోప్ పార్టీ ఎక్కడ ఉంది.
నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు
నిజంగా ఘటన జరిగితే మీ పోలీసు వ్యవస్థ ఎక్కడుంది.. జగన్ పర్యటనలపై ఎల్లో మీడియా తప్పుడు ప్రచారంతో రాద్దాంతం చేస్తుంది. సింగయ్య మరణం మమ్మల్ని చాలా బాధించింది. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా చనిపోయిన కార్యకర్తలను ఏనాడైనా ఆధుకున్నారా..?, ప్రభుత్వం వ్యవస్థలను బ్రష్టు పట్టిస్తున్నారు. మంత్రులు ఏం మాట్లాడుతున్నారో అర్ధం కావడం లేదు. సత్యసీలుల్లా మాట్లాడుతున్న మంత్రులు వెనక్కి తిరిగి చూసుకోవాలి. నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు. రాష్ట్రంలో ఎవరికి ఉద్యోగం వచ్చింది..చంద్రబాబు తాబెదారులకు ఉద్యోగాలు వచ్చి ఉంటాయి. ఆడ బిడ్డ నిధి ఎక్కడిచ్చారు..?, P4 కాన్సెప్ట్ ఏమిటి..?, P4 వలన ఒరిగింది ఏమిటి..? సమాధానం చెప్పాలి. చంద్రబాబుని ఎప్పుడు గెలిపించినా మోసం, ధగా తప్పదు.
యోగా డే కోసం ఇంత ఖర్చు అవసరమా..?, యోగా డే వలన ఏమిటి..?విశాఖకు ఏం మంచి జరిగింది..?, మనకు జరిగిన ప్రయోజనం ఏంటి..? సమాధానం చెప్పాలి. ఒక కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున చేస్తే ఆ ప్రాంతానికి ఏదో మేలు జరగాలి. ఋషికొండ భవనాలను ఒక మాన్యుమెంట్ లా తయారు చేసాం. ఋషికొండ భవనాల నిర్మాణంలో అవినీతి జరిగితే బిల్స్ ఎందుకు ఇచ్చారు.. యోగా డే వైఫల్యం కావడంతో సింగయ్య మరణంపై తప్పుడు ప్రచారం మొదలు పెట్టారు. సింగయ్య మరణం బాధాకరం..
యువతపై లాటీ ఛార్జ్ చేయడం ధర్మమేనా?
ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకోవాలి. హామీలు నెరవేర్చడానికి ప్రభుత్వం ప్రయత్నించాలి. పల్నాడు లాటీ ఛార్జ్ ఎందుకు చేశారు. యువతపై లాటీ ఛార్జ్ చేయడం ధర్మమేనా?, ప్రభుత్వాన్ని ఇలాగే నడుపుతారా?, చంద్రబాబు సహనం కోల్పోయి మాట్లాడుతున్నారు. మీరెవరు ప్రశ్నించడానికి అని బాబు అడుగుతున్నాడు. ప్రభుత్వ మెడలు వంచి తల్లికి వందనం ఇప్పించాం. మేం మాట్లాడకపోతే మరో మూడేళ్లు ప్రజలకు పథకాలు వచ్చేవి కాదు. మేం ప్రజల తరఫున పోరాడటానికే ఉన్నాం. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకూ పోరాడుతాం. బలహీన వర్గాల తరఫున పోరాడుతాం. బాబు మాట్లాడితే తాట తీస్తా అంటున్నాడు.. ఎవడి తాట తీస్తావ్. భూ స్థాపితం చేస్తాను అని చంద్రబాబు అంటున్నాడు.. ఏంటి ఆ మాటలు. ఇలాంటి మాటలు మాట్లాడి సీఎం కుర్చీ స్థాయిని దిగజార్చద్దు’ అని బొత్స హెచ్చరించారు.