అందుకే షర్మిలను ప్రజలు నమ్మలేదు: భూమన | Ysrcp Leader Bhumana Karunakar Reddy Comments On Sharmila And Chandrababu | Sakshi
Sakshi News home page

అందుకే షర్మిలను ప్రజలు నమ్మలేదు: భూమన

Oct 27 2024 2:01 PM | Updated on Oct 27 2024 3:37 PM

Ysrcp Leader Bhumana Karunakar Reddy Comments On Sharmila And Chandrababu

వైఎస్‌ జగన్‌ లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్వం వదులుకున్న వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు.

సాక్షి, తిరుపతి: వైఎస్‌ జగన్‌లాంటి నాయకులు చాలా అరుదుగా ఉంటారని.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు సర్వం వదులుకున్న వ్యక్తి అని వైఎస్సార్‌సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఇచ్చిన మాట కోసం కాంగ్రెస్‌ అధిస్టానాన్ని సైతం వైఎస్‌ జగన్‌ ధిక్కరించారు. కుట్రతో తప్పుడు కేసులు పెట్టినా ఆయన వీరుడిలా పోరాడారన్నారు.

‘‘వైఎస్‌ జగన్‌పై షర్మిల అన్యాయంగా మాట్లాడుతున్నారు. జగన్‌ అనే వ్యక్తి ఒక యుద్ధ వీరుడు. అందుకే పార్టీ ఓడిపోయినా కోట్లాది మంది జగన్‌ వెంటే ఉన్నారు. వైఎస్సార్‌ ఆశయాలను నెరవేర్చే వ్యక్తి జగన్‌ మాత్రమే. అందుకే ఆయనను ప్రజలు నమ్మారు.  తెలంగాణ మెట్టినిల్లు అంటూ షర్మిల అక్కడ రాజకీయాలు చేశారు. మళ్లీ చాపచుట్టేసి తిరిగి ఏపీకి వచ్చారు.. చంద్రబాబుకు నేరుగా మద్దతు పలుకుతున్నారు. షర్మిలను తెలంగాణ, ఏపీ ప్రజలు నమ్మలేదు. చంద్రబాబుతో కలసి సొంత అన్నపైనే షర్మిల కుట్ర చేస్తున్నారు. మీ లాంటి చెల్లి వైఎస్‌ జగన్‌కు ఉండటం బాధగా ఉంది. వైఎస్‌ జగన్‌ చిన్న తప్పు కూడా చేయలేదు.’’ అని భూమన చెప్పారు.

‘‘షర్మిల రాసిన లేఖలు టీడీపీ వెబ్‌సైట్‌లలో ఎలా వస్తున్నాయి?. చంద్రబాబుతో కలిసి అన్నపై కుట్ర చేయడం మీకు తగునా?. కేవలం రెండున్నర ఎకరాల చంద్రబాబు లక్షల కోట్లు సంపాదించారు.. అందులో తమ్ముడి, సోదరీమణులకు ఎంత ఆస్తి పంచి ఇచ్చారు.’’ అంటూ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రశ్నించారు.

 

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement