
సాక్షి, అమరావతి : టీడీపీ నేతలు, ఎల్లోమీడియాపై వైఎస్సార్సీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి పరువు నష్టం దావా వేశారు. ‘ముంబై నటికి వేధింపులు. సజ్జల సహాయం’ పేరుతో ఎల్లోమీడియా అసత్య కథనాలు ప్రచురించడమే కాకుండా, టీవీ ఛానల్స్లోనూ దుష్ప్రచారం చేస్తోంది.
ఎల్లో మీడియా అసత్య కథనాలపై సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఈనాడుతో పాటు, ఆ కథనం ఆధారంగా టీడీపీ ఆఫీసులో మాట్లాడిన వర్ల రామయ్యపై సజ్జల పరువు నష్టం దావా వేశారు. ఇప్పటికే అందరికీ లీగల్ నోటీసులు పంపించారు.