
అవనిగడ్డ, పాలకొండ, విశాఖ సౌత్ స్థానాలు పెండింగ్
సాక్షి, అమరావతి: జనసేన పార్టీ మరో 11 స్థానాలతో మూడో అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. తొలుత 5 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించగా.. రెండో జాబితాలో మరో రెండు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మూడో జాబితాతో కలిపి మొత్తంగా 18 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేస్తూ జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్కళ్యాణ్ ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
జనసేన పోటీచేసే మొత్తం 21 స్థానాల్లో ఇంకా అవనిగడ్డ, పాలకొండ, విశాఖ దక్షిణ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది. ఆ పార్టీ పోటీచేసే రెండు లోక్సభ స్థానాల్లో కాకినాడకు తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ఇటీవలే ఖరారు చేసినట్టు ఆ ప్రకటనలో పేర్కొన్నారు.