‘నెల రోజులే ఎందుకు? రెండు, మూడు నెలలు బెనారస్లోనే ఉండాలి’
Published
Tue, Dec 14 2021 9:13 AM
ఈటావా: ప్రధాని మోదీ వారణాసి పర్యటనను సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఎద్దేవా చేశారు. అవసాన దశలో జనం కాశీలోనే ఉంటారన్నారు. ప్రధాని మోదీ వారణాసి వచ్చారు, కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రారంభాన్ని పురస్కరించుకొని యూపీ ప్రభుత్వం నెల రోజుల పాటు సాంస్కృతిక ఉత్సవాలను నిర్వహించనున్న విషయాన్ని విలేకరులు ప్రస్తావించగా... ‘మంచిదే. నెల రోజులే ఎందుకు? ఆయన రెండు, మూడు నెలలు బెనారస్లోనే ఉండాలి.