కాంగ్రెస్‌ Vs బీజేపీ: ఎంపీపై దాడి.. మాజీ ఎంపీ, ఎమ్మెల్యేపై కేసు

27 Persons Booked For Allegedly BJP MP Sangam Gupta Attack - Sakshi

వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారాయి.

లక్నో: వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు రాబోతుండడంతో ఉత్తరప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారాయి. బీజేపీ, కాంగ్రెస్‌ల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే బీజేపీ ఎంపీ దాడి జరిగిందని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఈ పరిణామం రాజకీయంగా తీవ్ర వివాదం ఏర్పడింది. ప్రతాప్‌గఢ్ జిల్లాలోని సంగీపూర్ బ్లాక్‌లో శనివారం నిర్వహించిన గరీబ్ కల్యాణ్ మేళాలో బీజేపీ ఎంపీ, బీసీ మోర్చా జాతీయ ప్రధాన కార్యదర్శి సంగమ్‌లాల్ గుప్తాపై దాడి జరిగింది. ఆయన కుర్తాను చించేశారు.
చదవండి: కేటీఆర్‌ మెచ్చిన ‘పేపర్‌ బాయ్‌’ వెనుక ఆ తల్లి ఉద్దేశం తెలుసా?

ఈ పరిణామంపై బీజేపీ తీవ్రంగా శ్రమించింది. ఈ ఘటనపై ఏకంగా 27 మందిపై కేసు నమోదు చేశారు. కాంగ్రెస్‌ మాజీ ఎంపీ ప్రమోద్‌ తివారీతో పాటు ఆయన కుమార్తె, కాంగ్రెస్‌ ఎమ్మెల్యే ఆరాధన మిశ్రాతో పాటు మరికొందరిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై స్పందించిన ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
చదవండి: పాలమూరు వరప్రదాయిని.. 67వ వసంతంలోకి..
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top