వికాస సమితి కార్యదర్శిగా ఎంపిక
గోదావరిఖని/కోల్సిటీ(రామగుం డం): తెలంగాణ ఉద్యమంలో కీలకభూమిక పోషించి, తెలంగాణ పు నర్నిర్మాణం, అస్తిత్వం, అభివృద్ధిని ఆకాంక్షించే సంస్థగా ఏర్పడిన తె లంగాణ వికాస సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గోదావరిఖనికి చెందిన మల్లావజ్జల విజయానంద్ ఎంపికయ్యారు. ఆదివారం హైదరాబాదులో జరిగి న వికాస సమితి రాష్ట్ర కార్యవర్గంలో నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఇంతకాలం వికాస సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా పని చేసిన విజయనంద్ను రాష్ట్ర కార్యదర్శిగా ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఆయనను పలువురు అభినందించారు.


