పెద్దపల్లి ఏసీపీకి అవార్డు | - | Sakshi
Sakshi News home page

పెద్దపల్లి ఏసీపీకి అవార్డు

Jun 15 2025 7:34 AM | Updated on Jun 15 2025 7:34 AM

పెద్ద

పెద్దపల్లి ఏసీపీకి అవార్డు

పెద్దపల్లిరూరల్‌: ఏసీపీ గజ్జి కృష్ణ యాదవ్‌ శనివారం గవర్నర్‌ జిష్ణు దేవ్‌వర్మ నుంచి బెస్ట్‌ మోటివేటర్‌ అవార్డు అందుకున్నారు. పోలీస్‌ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం, దాతలను ప్రోత్సహించడం, సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా, రెడ్‌క్రాస్‌ సొసైటీ సిఫారసు మేరకు ఏసీపీకి బెస్ట్‌ మోటివేటర్‌ అవార్డు అందజేశారు. ఏసీపీని ప్రజాప్రతినిధు లు, అధికారులు తదితరులు అభినందించారు.

యోగా సాధనతో ఆరోగ్యం

జ్యోతినగర్‌(రామగుండం): యోగా సాధనతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటామని ఎన్టీపీసీ ప్రా జెక్టు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ చందన్‌ కుమార్‌ సా మంత అన్నారు. ఎన్టీపీసీ జ్యోతి ఫంక్షన్‌హాల్‌ లో దీప్తి మహిళా సమితి అధ్యక్షురాలు రాఖీ సా మంతతో కలిసి ఆరురోజుల పాటు సాగే యో గా శిక్షణ శిబిరాన్ని ఆయన శనివారం ప్రారంభించి మాట్లాడారు. ఈనెల 21న యోగా దినో త్సవం సందర్భంగా శిక్షణ శిబిరం ఏర్పాటు చేశామన్నారు. ఆరోగ్యకరమైన, సమతుల్య జీవితం కోరుకునే వారందరూ యోగాను తమ దినచర్యలో చేర్చుకోవాలని సూచించారు. యోగా గురువు విజయ్‌కుమార్‌ ఉన్నారు.

హిందీలో మాట్లాడుదాం

జ్యోతినగర్‌(రామగుండం): ప్రాజెక్టు అధికారిక విధుల్లో హందీని సమర్థవంతంగా అమలు చేద్దామని ఎన్టీపీసీ ఏజీఎం(హెచ్‌వోమెచ్‌ఆర్‌) బిజయ్‌కుమార్‌ సిగ్దర్‌ అన్నారు. స్థానిక మిలీని యం హాల్‌లో శనివారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మన జీవితంలో హిందీని చేర్చడానికి ఆచరణాత్మక మార్గాలను సదస్సులో వివరించామని తెలిపారు. డీజీఎం ప్రవీణ్‌ కే చౌదరి, జితేంద్రకుమార్‌, ఆదేశ్‌ కుమార్‌ పాండే, కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ ఎగ్జిక్యూటివ్‌ రూపాలి రంజన్‌ పాల్గొన్నారు.

మాజీమంత్రిని కలిసిన నేతలు

గోదావరిఖని: అమెరికా పర్యటన ముగించు కుని స్వదేశానికి తిరిగి వచ్చిన మాజీమంత్రి కొ ప్పుల ఈశ్వర్‌ను బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ అ ధ్యక్షుడు బొడ్డుపల్లి శ్రీనివాస్‌ శనివారం హైదరాబాద్‌లో కలుసుకున్నారు. ఈశ్వర్‌తోపాటు బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్‌, పోలీస్‌ హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ కో లేటి దామోదర్‌, జిల్లా గ్రంథాలయం మాజీ చై ర్మన్రఘువీరుసింగ్‌ను ఆయన కలుసుకుని శు భాకాంక్షలు తెలిపారు. మాజీ కార్పొరేటర్‌ కు మ్మరి శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ నేతలు చెలకలపల్లి శ్రీనివాస్‌, జక్కుల తిరుపతి పాల్గొన్నారు.

రెస్క్యూలో సత్తా చాటాలి

గోదావరిఖని: సింగరేణి మహిళా రెస్క్యూ స భ్యులు శిక్షణలో రాణించి కోలిండియా పోటీల్లో సత్తా చాటాలని రెస్క్యూ జీఎం శ్రీనివాస్‌రెడ్డి, రీజియన్‌ సేఫ్టీ జీఎం మధుసూదన్‌ ఆకాంక్షించారు. స్థానిక మెయిన్‌ రెస్క్యూ స్టేషన్‌లో శనివారం మహిళా రెస్క్యూ సభ్యులకు శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయి. 16రోజులకు ఒకటిచొప్పున 32రోజులపాటు రెండు బ్యాచ్‌లకు శిక్షణ ఇస్తామని వారు తెలిపారు. సింగరేణి చరిత్రలోనే తొలిసారి మహిళా రెస్క్యూ సభ్యులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. బొగ్గు గనుల సంస్థలో మహిళల సంఖ్య పెరుగుతున్న క్రమంలో వారి రెస్క్యూకు ప్రాధాన్యం ఏర్పడిందని వివరించా రు. వివిధ విభాగాల్లో వారికి శిక్షణ ఇస్తున్నామ ని అన్నారు. ఆర్జీ 1, 2, శ్రీరాంపూర్‌, భూపాలపల్లి, కొత్తగూడెం ఏరియాల్లో పనిచేస్తున్న మేనే జ్‌మెంట్‌ ట్రెయినీలకు శిక్షణ కొనసాగనుంది. ఈ కార్యక్రమంలో రెస్క్యూ సూపరింటెండెంట్‌ రాజేందర్‌రెడ్డి, క్వాలిటీ డీజీఎం సత్యనారాయ ణ, ఇన్‌స్ట్రక్టర్‌ తిరుపతి, టైనర్లు కిషన్‌రావు, వే ణు, సందీప్‌కుమార్‌, సాజిద్‌అలీ పాల్గొన్నారు.

పెద్దపల్లి ఏసీపీకి అవార్డు 
1
1/1

పెద్దపల్లి ఏసీపీకి అవార్డు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement