
సుందర నగరంగా రామగుండం
● ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్
గోదావరిఖని: అభివృద్ధి పనులతో రామగుండం పారిశ్రామిక ప్రాంతం సుందరంగా తయారవుతుందని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ అన్నారు. స్థానిక ప్రధాన చౌరస్తా సమీపంలో రూ.26 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన షాపింగ్ కాంప్లెక్స్ ప నులను మున్సిపల్, సింగరేణి అధికారులతో కలిసి ఎమ్మెల్యే శనివారం పరిశీలించారు. వాణిజ్య రంగంలో వస్తున్న ఆధునిక సదుపాయాలను వినియోగ దారుల చెంతకు తేవడమే లక్ష్యంగా నిర్మాణాలు కొ నసాగుతున్నాయని ఎంఎస్ ఠాకూర్ తెలిపారు. అంతకుముందు అంతర్గాం, పాలకుర్తి మండలాల ప్రతినిధులతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు.
రక్తదాతలే నిజమైన హీరోలు
కోల్సిటీ(రామగుండం): ఆపదలో ఉన్న వారి ప్రా ణాలు కాపాడేందుకు స్వచ్ఛందంగా రక్తదానం చే స్తున్నవారే నిజమైన హీరోలని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాకూర్ అన్నారు. ప్రపంచ రక్తదాతల దినోత్స వం సందర్భంగా స్థానిక జీజీహెచ్లోని బ్లడ్ బ్యాంక్ కేంద్రంలో సిమ్స్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్(జూడో) ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వ హించారు. ఏసీపీ రమేశ్తో కలిసి ఎమ్మెల్యే శిబిరా న్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే, ఏసీపీ రక్తదానం చే శారు. ఆర్ఎంవో రాజుతోపాటు జూడో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు పి.ప్రశాంత్, ఆర్యాతేజ, ప్రవీణ్, సందీప్, సుమన్, నితిన్, హర్షవర్ధన్, స్ని గ్ధభావన, గీతాశరణ్య, సుహాసిని, అన్షూ ఉన్నారు.
రూ.20 కోట్లతో అభివృద్ధి పనులు
రామగుండం: పట్టణ అభివృద్ధి పనులకు రూ.20 కోట్లు కేటాయించామని, శాశ్వత కట్టడాలను కూల్చివేస్తున్నట్లు వస్తున్న వదంతులను నమ్మవద్దని, ప్ర ధానంగా ఆర్యవైశ్య వ్యాపారులు ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ఠాకూర్ అన్నారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించారు. అభివృద్ధి పనులపై వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రతినిధులు ఈదు నూరి హరిప్రసాద్, ఇసంపెల్లి అంజులు, సిరిశెట్టి స తీ శ్, బందారపు బుగ్గరాములుగౌడ్, ఆర్యవైశ్య ప్ర ముఖులు దేమ లక్ష్మీనారాయణ, దొంతుల వైకుంఠం, పల్లెర్ల ఆంజనేయులు, తొడుపునూరి విజయ్కుమార్, తాటిపెల్లి నాగేందర్, దొంతుల కై లాసం, మల్యాల దామోదర్ పాల్గొన్నారు.