
లోక్ అదాలత్లో 5,263 కేసుల పరిష్కారం
గోదావరిఖనిటౌన్: జిల్లాలోని వివిధ కోర్టుల్లో శనివారం నిర్వహించిన లోక్ అదాలత్లో మొత్తం 5,263 కేసులు పరిష్కారమయ్యాయి. రాజీమార్గంలో వీటిని పరిష్కరించినట్లు కోర్టు అధికారులు వెల్లడించారు. ఇందులో సివిల్ కేసులు 19 కాగా, మిగిలినవి చెక్బౌన్స్, డ్రంక్ అండ్ డ్రైవ్, మోటార్ వాహన చట్టం, ఈ పెటీ, డిజాస్టర్ మేనే జ్మెంట్ తదితర కేసులు ఉన్నట్లు కోర్టు అధికా రులు వివరించారు. సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికికి చెందిన ఉరుసు రజిత భర్త రోడ్డు ప్రమాదంలో గతంలో చనిపోయాడు. అ యితే, మోటార్ చట్టం కింద కేసు నమోదైంది. శనివారం జరిగిన లోక్ అదాలత్లో ఈ కేసు రా జీకి వచ్చింది. దీంతో రూ.18 లక్షల పరిహారం చెక్కును మృతుడి భార్య రజితకు అందజేశారు. లోక్ అదాలత్ కార్యక్రమంలో జిల్లా ప్రధాన న్యా యమూర్తి సునీత కుంచాల, జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సప్నరాణి, జూనియర్ సివి ల్ జడ్జి ఎన్.మంజుల, లోక్ అదాలత్ సభ్యులు కె.శ్రీధర్, అల్లంకి రజని, లీగల్ గ్రేడ్ కౌన్సిల్ సభ్యులు ఎం.శ్రీనివాస్, సంకీర్తన, భాను, డీసీపీ కరుణాకర్, న్యాయవాదులు, ఇండియన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు, పోలీస్ సిబ్బంది, కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు.
లోక్అదాలత్లో పరిష్కరించిన కేసులు
కోర్టు కేసులు
మంథని 417
గోదావరిఖని 3,652
సుల్తానాబాద్ 508
పెద్దపల్లి 686