విజయనగరం, పార్వతీపురం వంటి వెనుకబడిన ప్రాంతాల్లో మెడికల్ కాలేజీలు అంటే ఊహకందని అంశం. కానీ గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వచ్చాక అందులో మంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణ కృషితో రూ.500 కోట్ల ఖర్చుతో విజయనగరం మెడికల్ కాలేజీ నిర్మాణం పూర్తిచేసుకుంది. వైద్యవిద్య, మెరుగైన వైద్యసదుపాయాలు జిల్లా ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే, రూ.155 కోట్లతో కురుపాంలోని ట్రైబల్ ఇంజినీరింగ్ కాలేజీ ఏర్పాటు చేశారు. ఇంతలో ప్రభుత్వం మారడంతో మిగులు పనులు పూర్తిచేసేందుకు చంద్రబాబు ప్రభుత్వం చొరవచూపడంలేదు. ఫలితం.. గిరిజన విద్యార్థులకు ఇంజినీరింగ్ విద్య అందని ద్రాక్షగా మారింది.


