700 ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్‌ | - | Sakshi
Sakshi News home page

700 ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్‌

Sep 16 2026 4:01 AM | Updated on Sep 16 2026 4:01 AM

700 ఉద్యోగాలకు కౌశలం డ్రైవ్‌

● 17,18 తేదీల్లో కలెక్టరేట్‌లో ఇంటర్వ్యూలు

విజయనగరం గంటస్తంభం: జిల్లాలోని నిరుద్యోగ యువతకు ప్రైవేట్‌ రంగంలో ఉపాధి కల్పించేందుకు ఈనెల 17,18 తేదీల్లో విజయనగరంలోని కలెక్టరేట్‌ ఆడిటోరియంలో కౌశలం డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు కలెక్టర్‌ ఎస్‌.రాంసుందర్‌ రెడ్డి తెలిపారు. గ్రీన్‌టెక్‌ ఇండస్ట్రీస్‌(ఇండియా) ప్రైవేట్‌ లిమిటెడ్‌(జీటీఐ)ఆధ్వర్యంలో ఫౌండ్రీ విభాగంలో 400, మెషినింగ్‌ విభాగంలో 300 పోస్టులకు ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. 18 నుంచి 32 ఏళ్ల వయస్సు గల పురుష అభ్యర్థులు, ఎస్‌ఎస్‌సీ, ఇంటర్‌, డిగ్రీ, ఐటీఐ, డిప్లమో, బీటెక్‌(మెకానికల్‌) తదితర విద్యార్హతలు కలిగిన వారు, ఫ్రెషర్లు కూడా హాజరుకావచ్చన్నారు. ఎంపికై వారికి రూ.15,500 నుంచి రూ.16,500 వరకు వేతనంతో పాటు హాజరు బోనస్‌, నైట్‌ షిఫ్ట్‌, వర్క్‌స్టేషన్‌ అలవెన్సులు, ఉచిత భోజనం, వసతి, ఈపీఎఫ్‌, ఈఎస్‌ఐ, బోనస్‌, గ్రాట్యుటీ వంటి ప్రయోజనాలు అందనున్నట్లు తెలిపారు. శిక్షణ అనంతరం ప్రతిభ, ఆసక్తి ఉన్న వారికి సెర్బియాలోని సంస్థ గ్రూప్‌ కంపెనీలో ఏడాది పనిచేసే అవకాశం కూడా లభించవచ్చన్నారు. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వివరాలకు ఫోన్‌ 90305476667 నంబర్‌ను సంప్రదించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement