ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవవని తెలిసి సంబంధిత అధికారులు అవసరమైన చర్యలపై దృష్టి పెట్టలే దు.ఫలితం అన్నదాతకు తీరని నష్టం. తోటపల్లి ప్రాజెక్టు పరిధిలో శివారున ఉన్న 16 గ్రామాలకు సాగునీరు ఇవ్వలేమని తేల్చేశారు. పైగా ఎరువులు, క్రిమిసంహారక మందుల సేకరణకు సాంకేతికత ముడిపెట్టారు. కౌలు రైతులపై దృష్టి ెపెట్టలే దు. తొలి దశలో వెదలు జల్లిన రైతులు నీరు లేక పంటలు నష్టపోవడంతో రెండుమూడు దఫాలు వెదలు వేసి అదృష్టం పరీక్షించుకుని నష్టపోయారు. మండలవ్యాప్తంగా వందలాది ఎకరాల్లో ఉడుపులు జరగలేదు. నారు ముదిరిపో యి ఇబ్బందులు పడుతున్నారు. నీటికోసం రైతులే సొంత మదుపులతో కాలువలు బాగుచేసుకున్నారు. మోటార్లు పెట్టి ఇక్కట్లు పడుతున్నారు. ప్రభుత్వం ఈ జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి.
–కండాపు ప్రసాదరావు, రైతు సంఘం
నాయకుడు, రుద్రిపేట, పాలకొండ మండలం


