‘కోటి సంతకాలకు’ విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

‘కోటి సంతకాలకు’ విశేష స్పందన

Dec 9 2025 10:34 AM | Updated on Dec 9 2025 10:34 AM

‘కోటి

‘కోటి సంతకాలకు’ విశేష స్పందన

ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌

రేగిడి: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్‌సీపీ తలపెట్టిన కోటిసంతకాల సేకరణకు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అనూహ్య స్పందన వస్తోందని ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్‌ అన్నారు. రేగిడిలో విలేకరులతో సోమ వారం ఆయన మాట్లాడారు. ఈ నెల 10న నియో జకవర్గ స్థాయిలో కోటి సంతకాల ప్రతుల సేకరణకు, ఈ నెల 15న జిల్లా స్థాయిలో చేపట్టనున్న కోటి సంతకాల ర్యాలీకి ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక అన్నివర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఫీజురీయింబర్స్‌ మెంట్‌ నిధులు విడుదల కాక విద్యార్థులు, ఎరువులు, విత్తనాలు దొరకకపోవడం, పంట కొనుగోలు చేయక రైతులు, ఉద్యోగాలులేక, నిరుద్యోగ భృతి అందక నిరుద్యోగులు, పింఛన్లు మంజూరుకాక అర్హులు, రీ వెరిఫికేషన్‌తో దివ్యాంగులు.. ఇలా ప్రతి వర్గం ఇబ్బందులు పడుతోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికల్లో 50 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరికీ పింఛన్లు అందజేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటగా మారిందన్నారు. ఆయన వెంట పార్టీ ఉపాధ్యక్షుడు టంకాల అచ్చెన్నాయుడు, పార్టీ మండల కన్వీనర్‌ వావిలపల్లి జగన్మోహనరావు, వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు పాలవలస దవళేశ్వరరావు ఉన్నారు.

‘కోటి సంతకాలకు’ విశేష స్పందన 1
1/2

‘కోటి సంతకాలకు’ విశేష స్పందన

‘కోటి సంతకాలకు’ విశేష స్పందన 2
2/2

‘కోటి సంతకాలకు’ విశేష స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement